3.3.26

ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్లు వేగ‌వంతం చేయాలి – జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం ontimitta temple







ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో మార్చి 26 అంకురార్పణమార్చి 27 శ్రీరామనవమి పర్వదిన ధ్వజారోహణముతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని టీటీడీ జేఈవో శ్రీ వివీరబ్రహ్మం అధికారుల‌ను ఆదేశించారుబ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల‌పై సోమవారం ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయంకళ్యాణ వేదికల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను జేఈవో  అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు


 సంద‌ర్భంగా జేఈవో మాట్లాడుతూ, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ 1 జ‌రుగ‌నున్న శ్రీ సీతారాముల క‌ల్యాణం ఏర్పాట్ల‌ను వేగ‌వంతం చేయాల‌ని అధికారులను ఆదేశించారు.


క‌ల్యాణం రోజున వ‌చ్చే వేలాది మంది భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన అన్న‌ప్ర‌సాదంతాగునీరుమ‌జ్జిగ అందించేందుకు చ‌క్క‌టి ఏర్పాట్లు చేయాల‌న్నారుఅన్ని విభాగాలు ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ రూపొందించుకుని క‌ల్యాణం రోజున భ‌క్తుల‌కు అందాల్సిన సౌక‌ర్యాల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాల‌ని కోరారుఎం వేడిమి నుంచి ఉప‌శ‌మ‌నం క‌ల్పించేందుకు భ‌క్తులు న‌డిచే ప్రాంతాల్లో కూల్ పెయింట్ వేయాల‌నిఅవ‌స‌ర‌మైన చోట్ల చ‌లువపందిళ్లు ఏర్పాటు చేయాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారుఊరేగింపు నిర్వ‌హించే వాహ‌నాలుర‌థానికి సంబంధించిన ప‌టిష్ట‌త‌ను ప‌రిశీలించి ఫిట్‌నెస్ స‌ర్టిఫికేట్ తీసుకోవాల‌న్నారు. .


అత్య‌వ‌స‌ర వైద్య ప‌రిస్థితుల్లో వెంట‌నే స్పందించేందుకు వీలుగా అంబులెన్సులు సిద్ధంగా ఉంచుకోవాల‌నిప్ర‌థ‌మ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేసి త‌గిన‌న్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాల‌ని వైద్య అధికారులకు సూచించారుసాంస్కృతిక‌సంగీత కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన ప్ర‌ణాళిక త్వ‌రిత‌గ‌తిన సిద్ధం చేయాల‌న్నారుక‌ల్యాణం రోజున భ‌క్తుల‌ ర‌వాణావ‌స‌తిపార్కింగ్‌ క‌ల్పించేందుకు ఆర్‌టిసి అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని ఆదేశించారుఅన్ని విభాగాల ధికారులు పూర్తి స‌న్న‌ద్ధంగా ఉండి కడప జిల్లాలోని ఆయా విభాగాల అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌న్నారు.


 సమావేశంలో ఎస్ఇ శ్రీ మనోహర్డెప్యూటీ ఈవో శ్రీ శివ ప్రసాద్,  విజిఓ శ్రీ గిరిధర్డిఈ (ఎలక్ట్రికల్శ్రీ రవి శంకర్ రెడ్డి  అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments