తిరుపతి
శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు బుధవారం నిర్వహించిన సంగీత, నృత కార్యక్రమాలు భక్తులను అలరించాయి.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక వేదికపై తిరుపతి శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, నాదస్వర మరియు డోలు పాఠశాల ఆధ్వర్యంలో సాయంత్రం 6 నుంచి 7:15 వరకు జరిగిన గాత్ర కచేరీలో శ్రీమతి పి.శైలజ బృందం "సిద్ధి వినాయకం..., తెలియలేరు రామ..., కమలాప్తకుల....,భజన సేయరాద..," అను కృతులు ఆలపించారు తదుపరి రాత్రి 7:15 నుంచి 8:30 వరకు జరిగిన భరతనాట్య నృత్య కార్యక్రమంలో శ్రీమతి శైలజ రెడ్డి బృందం "తక్కువేమీ మనకు..., దేవ దేవం భజే..., రామభజనలు..., కళ్యాణ రామ...." అను అంశాలను ప్రదర్శించారు.
No comments :
Write comments