20.3.26

భక్తుల సౌకర్యాల అభివృద్ధికి సూచనలు ఇవ్వండి శ్రీ‌వారి సేవకులకు టీటీడీ ఈవో పిలుపు srivari sevakas







తిరుమలకు విచ్చేసే భక్తులకు నిస్వార్థంగా సేవలందిస్తున్న శ్రీవారి సేవకులు భక్తుల సౌకర్యాల మెరుగుదలకు తమ సూచనలు కూడా ఇవ్వాలని టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర తెలిపారుగురువారం తిరుమలలోని శ్రీవారి సేవా సదన్-2ను తొలిసారిగా సందర్శించిన ఈవో సేవకులకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.


తదనంతరం సేవకులతో సమావేశమై అన్నప్రసాదంపరిశుభ్రతక్యూలైన్ నిర్వహణ తదితర అంశాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు


భక్తులకు ప్రత్యక్షంగా సేవలందించే సేవకులు వారి సమస్యలను బాగా అర్థం చేసుకోగలరనిఅందువల్ల వారు అందించే సూచనలు ఎంతో విలువైనవని ఈవో పేర్కొన్నారు.


సేవ‌కులు అందించే ఫీడ్‌బ్యాక్ క్తుల సౌకర్యాల అభివృద్ధికివ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడానికి కీలకంగా ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.


అంత‌క‌ముందు ఈవో సేవా సదన్-2లోని రిసెప్షన్వెరిఫికేషన్రిజిస్ట్రేషన్ కౌంటర్లను సందర్శించిసేవకులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారుఅలాగే హాల్స్‌ను తనిఖీ చేశారు.


అనంత‌రం కొంతమంది సేవకులతో మాట్లాడ‌గా వారికి అందుతున్న సౌకర్యాలపై సేవకులు సంతృప్తి వ్యక్తం చేశారు.


 కార్యక్రమంలో టీటీడీ సీపీఆర్వో డాక్ట‌ర్ టి.ర‌విశ్రీవారి సేవా విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

No comments :
Write comments