26.3.26

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన టీటీడీ జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం ttd jeo






ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1 నిర్వహించనున్న శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి విచ్చేసే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌశ్రీ నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను టీటీడీ జేఈవో శ్రీ వివీరబ్రహ్మంజిల్లా ఎస్పీ శ్రీ నచికేత్ విశ్వనాథ్సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణలతో కలిసి పరిశీలించారు.


 సందర్భంగా టీటీడీ మరియు జిల్లా అధికారులు బుధవారం ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంకళ్యాణ వేదిక వద్ద ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు.


ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కాన్వాయ్ ట్రయల్ రన్సిఎం విడిది చేయనున్న టీటీడీ అతిథి గృహంఆలయ దర్శనంవేద ఆశీర్వచనం తదితర అంశాలను పరిశీలించి పలు సూచనలు చేశారుఅలాగే కళ్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లుగ్యాలరీలుభక్తులకు అందించనున్న అన్నప్రసాదం కౌంటర్లను కూడా పరిశీలించారు.


 సందర్భంగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో జేఈవో మాట్లాడుతూశ్రీరామనవమి సందర్భంగా 50 నుండి 60 వేల మంది భక్తులు దర్శనానికి వచ్చే అవకాశం ఉన్నందున భక్తులందరికీ రుచికరమైన అన్నప్రసాదం అందించాలనిపానకంవడపప్పు తప్పనిసరిగా అందించాలని ఆదేశించారుఆలయంలో ఎండ వేడిమి నుండి భక్తులకు పశమనం కలిగించేందుకు  నిరంతరం నీటిని పిచికారి చేయాలని సూచించారుఅలాగే కళ్యాణ వేదికకు విచ్చేసే ప్రతి భక్తునికి వాటర్ బాటిళ్లు అందించాలని అధికారులను దేశించారు.


జిల్లా ఎస్పీ శ్రీ నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూసుమారు 3000 మంది పోలీసులతో జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారుభక్తులకు పార్కింగ్ విషయంలో ఎలాంటి సౌకర్యం కలగకుండాట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.


 కార్యక్రమంలో సీఈ శ్రీ టి.వి. సత్యనారాయణఎస్ఈ శ్రీ మనోహరం, ఎస్ఈ (ఎలక్ట్రికల్శ్రీ వెంకటేశ్వర్లుడిప్యూటీ ఈవోలు శ్రీమతి ప్రశాంతిశ్రీ శివప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments