26.3.26

ముత్యపుపందిరి వాహనంపై భక్తులను కటాక్షించిన శ్రీ పట్టాభిరాముడు mutyapu pandiri



వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి వార్షిక బ్ర


హ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన బుధవారం ఉదయం 8 గంటలకు ముత్యపుపందిరి వాహనంపై శ్రీ పట్టాభిరామస్వామివారు భక్తులకు కటాక్షం ప్రసాదించారు.


గజరాజులువృషభాలుఅశ్వాలు ముందుకు సాగుతుండగాభజన బృందాలు రామనామ స్మరణతో కోలాటాలు ఆడుతూ స్వామివారిని అనుసరించాయి సందర్భంగా స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను ఆశీర్వదించారు.


మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే ముత్యపుపందిరిపై స్వామివారు భక్తులకు చల్లని కటాక్షం ప్రసాదిస్తారుజ్యోతిషశాస్త్రంలో ముత్యం చంద్రునికి ప్రతీకగా భావించబడుతుందిసముద్రం మనకు ప్రసాదించి అమూల్యమైన వస్తువుల్లో ముత్యం ఒకటిముత్యాల పందిరి కింద స్వామివారి దర్శనం భక్తుల తాపత్రయాలను తొలగించి వారి జీవితాల్లో శాంతిచల్లదనాన్ని ప్రసాదిస్తుందని పండితులు తెలిపారు.


రాత్రి 8 గం.లకు శ్రీ పట్టాభిరాముడు హనుమంత వాహనంపై విహరించి క్తులను ఆశీర్వదిస్తారు.


 వాహనసేవలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీఏఈవో శ్రీ గోపినాథ్టెంపుల్ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కృష్ణమూర్తినాగరాజు మరియు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments