మంగళవారం మధ్యాహ్నం 3.20 నుండి సాయంత్రం 6.47 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయం, శ్రీ శ్రీనివాస ఆలయాల్లో రాత్రి 7.30 గంటలకు తలుపులు తెరిచారు. శుద్ధి, పుణ్యహవచనం ఇతర కైంకర్యాల అనంతరం సర్వదర్శనానికి అనుమతించారు.
తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయాన్ని రాత్రి 7.30 గంటలకు తెరిచారు. శుద్ధి, పుణ్యహవచనం ఇతర కైంకర్యాల అనంతరం రాత్రి 9 గంటలకు సర్వదర్శనానికి అనుమతించారు.
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి ఆలయాలను రాత్రి 7.30 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించారు. తరువాత భక్తులకు సర్వదర్శనం కల్పించారు.
నారాయణవనంలోని శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామి, కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామి, నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామి, బుగ్గలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి, నగరిలోని శ్రీ కరియమాణిక్యస్వామి ఆలయాలను రాత్రి 7.30 గంటలకు తెరిచారు. ఆలయ శుద్ధి, పుణ్యహవచనం తదితర సేవల అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించారు.
తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి, వాయల్పాడులోని శ్రీ పట్టాభిరామస్వామి, కోసువారిపల్లిలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయాలను రాత్రి 7.30 గంటలకు తెరిచి శుద్ధి అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించారు.
తిరుపతిలో అన్నప్రసాద వితరణ
తిరుపతిలోని టిటిడి ఉద్యోగుల క్యాంటీన్, శ్రీపద్మావతి విశ్రాంతి గృహం క్యాంటీన్, శ్రీనివాసం, విష్ణునివాసం, ఆసుపత్రులు, తిరుచానూరులోని అన్నప్రసాద భవనంలో బుధవారం ఉదయం శుద్ధి కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం యధావిధిగా అన్నప్రసాద వితరణ జరుగుతోంది.
No comments :
Write comments