17.3.26

బ్రహ్మోత్సవాల్లో తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా ప్రత్యేక అలంకరణలు : టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి vontimitta






ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా విచ్చేసే భక్తులకు సౌకర్యవంతమైన సేవలు కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాచెరుకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు.


శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఏర్పాట్లపై సోమవారం ఒంటిమిట్ట టీటీడీ అతిథి గృహంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.


 సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూముఖ్యంగా శ్రీరామనవమి మరియు శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున భద్రతపార్కింగ్అన్నప్రసాదాల పంపిణీతాత్కాలిక మరుగుదొడ్లునిరంతరాయ విద్యుత్ సరఫరాప్రథమ చికిత్స కేంద్రాలుఆర్టీసీ బస్సులుహెల్ప్ డెస్కులుసూచిక బోర్డులుపారిశుద్ధ్యంపబ్లిక్ అడ్రస్ సిస్టమ్ వంటి అన్ని విభాగాలు సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో పనిచేయాలని సూచించారు.


బ్రహ్మోత్సవాల్లో తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా ప్రత్యేక అలంకరణలు : టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి

 

శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలకు తెలుగు సంప్రదాయం ప్రతిబింబించేలా ప్రత్యేక అలంకరణలు చేపట్టాలని ఆయన సూచించారుఏప్రిల్ 1 జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు.


భక్తులను ఆకట్టుకునే విధంగా విద్యుత్ మరియు పుష్పాలంకరణలు చేయాలని సూచించారు


అలాగే కళ్యాణ వేదిక వద్ద గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీవారి సేవకులుపోలీస్ సిబ్బందిటీటీడీ ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.


వేసవి దృష్ట్యా కళ్యాణ వేదిక వద్ద నీటితో పిచికారీ చేయాలనివడదెబ్బ తగలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారుస్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని పరిశుభ్రతపారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారుపార్కింగ్ సమస్యలు లేకుండా పోలీసులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.


గ్యాలరీల్లో నిర్వహణ పటిష్టంగా ఉండాలనిప్రతి గ్యాలరీలో అన్నప్రసాదాలుతాగునీరుశ్రీవారి సేవకులు మరియు సంబంధిత అధికారిని ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యాలు ప్రణాళికాబద్ధంగా అందేలా ర్యలు తీసుకోవాలని సూచించారు.


మార్చి 26 అంకురార్పణతో కార్యక్రమాలు ప్రారంభమైమార్చి 27 ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని టీటీడీ జేఈవో శ్రీ వివీరబ్రహ్మం తెలిపారుబ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శాఖల వారీగా అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు.


భక్తులకు ఇబ్బంది లేకుండా పటిష్ భద్రత : సివిఎస్వో శ్రీ కేవీ మురళీకృష్ణ 


శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి వచ్చే భక్తులకు పోలీసుల సమన్వయంతో పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నామని టిటిడి సివిఎస్వో శ్రీ కేవీ మురళీకృష్ణ తెలిపారు. కమాండ్ కంట్రోల్ ద్వారా భక్తులకు సమస్యలు తలెత్తితే వెంటనే స్పందించేందుకు ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని సూచించారువిధుల్లో ఉన్న సిబ్బందిశ్రీవారి సేవకులు  నెంబర్ ద్వారా సేవలు అందించాలని కోరారు.


 సమావేశంలో పలువురు జిల్లా అధికారులుటీటీడీ సీఈ శ్రీ సత్యనారాయణఎస్.ఈలు శ్రీ మనోహరంశ్రీ వేంకటేశ్వర్లుశ్రీ నరసింహమూర్తిడిప్యూటీ ఈవోలు శ్రీ సెల్వంశ్రీ శివప్రసాద్అన్నప్రసాదం ప్రత్యేక అధికారి శ్రీ జి.ఎల్.ఎన్శాస్త్రి తదితర అధికారులు పాల్గొన్నారు.


No comments :
Write comments