VIDEO
ఏప్రిల్
1 వ తేదిన ఒంటిమిట్ టలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జర గనున్న శ్రీ సీతారాముల కళ్యాణం ఏర్పాట్లపై శనివారం టీటీడీ అదనపు ఈవో శ్రీ సి . హెచ్ . వెంకయ్య చౌ దరి కడప జిల్లా కలెక్టర్ శ్రీ చె రుకూరి శ్రీధర్ , టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం , జిల్లా ఎస్పీ శ్రీ సచికేత్ విశ్వనాథ్ , టీటీడీ సీ వీఎస్వో శ్రీ మురళీకృష్ణలతో కలి సి క్షేత్రస్థాయిలో పరిశీలించా రు .
కళ్యాణోత్సవం సందర్భంగా ఒంటిమి ట్ట శ్రీ కోదండ రామస్వామి వారి కి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు దం పతులు పట్టు వస్త్రాలు సమర్పిం చనున్న నేపథ్యంలో కళ్యాణ వేదిక, హెలిప్యాడ్, ఆలయం వద్ద ఏర్పాట్ లను పరిశీలించారు.
అనంతరం అదనపు ఈవో, జిల్లా కలెక్ టర్ కలిసి టీటీడీ, జిల్లా అధికా రులతో ఆలయ సమీపంలో ఉన్న సమావేశ మందిరంలో సమన్వయ సమావేశం నిర్ వహించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో అధికారు లతో మాట్లాడుతూ అధికారులందరూ సమ న్వయం చేసుకుని సమిష్టిగా పనిచే సి కార్యక్రమాన్ని విజయవంతం చే యాలని అన్నారు. భక్తులకు ఎలాం టి సమస్య తలెత్తకుండా కమాండ్ కం ట్రోల్ రూమ్ సమర్థవంతంగా పని చే యాలని చెప్పారు.
ఏర్పాట్లపై భక్తుల నుండి విభాగా ల వారీగా అభిప్రాయాలు సేకరిస్తా మని తెలిపారు. ప్రతి చిన్న సమస్ యను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కార్యాచరణ సమర్థవంతంగా ఉండేలా అ ధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉం టూ శ్రీ సీతారాముల కళ్యాణాన్ని విజయవంతం చేయాలని తెలియజేశారు.
ఈ సందర్భంగా ఇంజినీరింగ్, ఎలక్ ట్రికల్, పోలీసు, ఫైర్, ఎన్డీ ఆర్ఎఫ్, వైద్య, ఏపీఎస్ఆర్టీసీ, ప్రజా సంబంధాల శాఖ తదితర వివిధ విభాగాల అధికారులతో జిల్లా కలె క్టర్ మాట్లాడుతూ కళ్యాణోత్సవా నికి పూర్తి సన్నద్ధతతో సమాయత్ తంగా ఉండాలన్నారు.
ఎండ తీవ్రతకు భక్తులు డీహైడ్రే షన్ కు గురయ్యే అవకాశం ఉండటంతో వైద్యులు ముందు జాగ్రత్తగా అందు కు తగిన విధంగా మందులు, అంబులె న్సులు అందుబాటులో ఉంచుకోవాలన్ నారు. భక్తులకు అన్న ప్రసాదాలు , తాగునీరు, మజ్జిగ పంపిణీ చేసేం దుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చే యాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ, జిల్లా మరియు పోలీసు అధికారులు పాల్గొ న్నారు.
No comments :
Write comments