ఏప్రిల్ 20న రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని, గుంటూరుకు చెందిన భాష్యం ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ శ్రీ బి. రామకృష్ణ తిరుమలలో ఒక్కరోజు శ్రీ వారి అన్నప్రసాద వితరణ కోసం రూ.44 లక్షలను విరాళంగా అందించారు.
ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం తిరుపతిలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, టీటీడీ అన్నప్రసాద విభాగం డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రకు విరాళం డిడిని దాత అందజేశారు.
ఈ సందర్భంగా టీటీడీ అధికారులు మాట్లాడుతూ, తిరుమలలో నిత్యం వేలాది మంది భక్తులకు అందిస్తున్న అన్నప్రసాద సేవకు దాతల సహకారం ఎంతో ప్రాధాన్యమైందని తెలిపారు. భక్తుల సేవలో భాగంగా ఇటువంటి దాతృత్వం మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
No comments :
Write comments