28.4.26

శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి












భారత ఉప రాష్ట్రపతి గౌ|| శ్రీ సి.పిరాధాకృష్ణన్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు


ఆలయం వద్దకు ఉపరాష్ట్రపతి చేరుకోగానే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామ నారాయణ రెడ్డి తో బాటు టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రఅదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిసి వి ఎస్  శ్రీ మురళీకృష్ణలు ఆయనను సాదరంగా ఆహ్వానించగాఅర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.


అనంతరం  ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు తర్వాత వకుళామాతవిమాన వేంకటేశ్వరస్వామిభాష్యకార్ల సన్నిధియోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు.


అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. భారత ఉపరాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ మరియు ఈవో స్వామి వారి చిత్ర పటాన్నితీర్థప్రసాదాలను అందించారు.


శ్రీ బేడీ ఆంజనేయ దర్శనం:


భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారిని కూడా దర్శించుకున్నారు.


 కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖుల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ హరిజవహర్లాల్ టిటిడి బోర్డు సభ్యులు శ్రీ రామమూర్తిశ్రీ భాను ప్రకాష్ రెడ్డిశ్రీ జంగా కృష్ణమూర్తిపలువురు రాష్ట్రస్థాయి మరియు జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.


No comments :
Write comments