15.4.26

సమ సమాజ నిర్మాణానికి మార్గదర్శి అంబేద్కర్: టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి ఘనంగా డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు dr ambedkar










భారత రాజ్యాంగ శిల్పి డాబీఆర్ అంబేద్కర్ జయంతి సమ సమాజ నిర్మాణానికి మార్గదర్శి అని  టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడారుతిరుపతిలోని మహతి కళాక్షేత్రం నిండా సమానత్వ సందేశం మార్మోగిందిభారత రాజ్యాంగ శిల్పి డాబి.ఆర్అంబేద్కర్ 135 జయంతి వేడుకలను టిటిడి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.


 సందర్భంగా టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూడాఅంబేద్కర్ జయంతి కేవలం ఒక వేడుక మాత్రమే కాకుండా సమ సమా పండుగగా భావించాలన్నారుదేశ నిర్మాణంలో పౌరులుకార్మికులు, రైతులుమహిళలుపీడిత వర్గాల హక్కుల పరిరక్షణలో అంబేద్కర్ గారి కృషి అపారమని కొనియాడారుకార్యనిర్వాహకశాసనన్యాయ వ్యవస్థలను బలోపేతం చేస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం కలిగేలా రాజ్యాంగాన్ని రూపొందించారని తెలిపారు. స్వేచ్ఛసమానత్వంసౌభ్రాతృత్వం అనే విలువలతో భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందన్నారు.


టిటిడి సివిఎస్వో శ్రీ కె.విమురళీకృష్ణ మాట్లాడుతూఅంబేద్కర్ అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ప్రజలను చైతన్య మార్గంలో నడిపించిన మహనీయుడని తెలిపారుస్పష్టమైన ప్రణాళికతో దేశ ప్రజలకు దిశానిర్దేశం చేసిన నాయకుడని అభివర్ణించారు.


ముఖ్య వక్తగా హాజరైన ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ ఎంసతీష్ చందర్ మాట్లాడుతూప్రపంచంలో ఎక్కడా అంబేద్కర్ లాంటి రాజ్యాంగ శిల్పికి లభించిన గౌరవం మరెక్కడా లేదని అన్నారుభారతదేశానికి స్థిరమైన వ్యవస్థను అందించి దేశ భవిష్యత్తును మలిచిన మహానుభావుడని కొనియాడారు.


మరో వక్తగా ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ డాచింతకింది కాశీం మాట్లాడుతూదేశాన్ని లౌకికవాదంసామ్యవాదం వైపు నడిపించి దూరదృష్టి గల నాయకుడు అంబేద్కర్ అని పేర్కొన్నారునీటి హక్కులుమహిళా విద్యసామాజిక న్యాయం వంటి అంశాల్లో ఆయన పోరాటం ఆదర్శప్రాయమని చెప్పారు.


టిటిడి పాలక మండలి సభ్యురాలు శ్రీమతి పనబాక లక్ష్మీ మాట్లాడుతూఅంబేద్కర్ కల్పించిన హక్కుల ల్లే తాను కేంద్రమంత్రిగా సేవ చేసే అవకాశం పొందానని చెప్పారుయువత ప్రభుత్వం కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు చేరాలని సూచించారు.


 కార్యక్రమంలో భాగంగా ముందుగా శ్రీవారి విగ్రహానికి పూజలు నిర్వహించిజ్యోతి ప్రజ్వలన అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారువిజయవాడ బృందంకళారత్న శ్రీ రంగం రాజేష్ ధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.


60 మంది ఉద్యోగులకు కమ్యూనల్ అవార్డులు ప్రదానం


 సందర్భంగా టిటిడిలో విధులు నిర్వహిస్తున్న 60 మంది ఉద్యోగులకు డాబి.ఆర్అంబేద్కర్ కమ్యూనల్ అవార్డులను అందజేశారుఅవార్డు గ్రహితలకు 5 గ్రాముల వెండి డాలర్‌తో పాటు అంబేద్కర్ చిత్రపటాన్ని అందించి ఘనంగా సన్మానించారుక్విజ్వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారుముఖ్య అతిథులువక్తలను సన్మానించారు.


 కార్యక్రమం డిప్యూటీ ఈవో (సంక్షేమంశ్రీ ఆనందరాజు ఆధ్వర్యంలో జరిగిందిటిటిడి సిపిఆర్వో డాటిరవిఉద్యోగ సంఘ నాయకులుఉద్యోగులువిద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.


No comments :
Write comments