21.4.26

ఆధ్యాత్మికతతో సమాజ మార్పుకు శ్రీకారం చుట్టిన రామానుజాచార్యులు : శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి jeeyar swamy





భగవంతుడు అందరివాడనిసమాజంలో ప్రతి ఒక్కరూ సమానత్వ భావనతో జీవించాలనే సందేశాన్ని శ్రీ రామానుజాచార్యులు ఇచ్చారని తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి తెలిపారుటీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సోమవారం సాయంత్రం శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాలు ఏప్రిల్ 22 వరకు మూడు రోజుల పాటు జరుగనున్నాయి.


 సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూఆదిశేషుని అవతారమైన రామానుజాచార్యులు శరణాగతి భక్తిని విస్తృతంగా ప్రచారం చేశారని చెప్పారుశరణాగతి భావంతో భగవంతుని సేవించడం ద్వారా జీవితం సార్థకమవుతుందని వివరించారు.

అలాగేఆయన ప్రచారం చేసిన విశిష్టాద్వైత తత్వం భక్తిజ్ఞానం, సేవ మార్గాలను కలిపి సమాజానికి దిశానిర్దేశం చేసిందన్నారురామానుజాచార్యుల బోధనలు నేటికీ ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు.


అనంతరం హైదరాబాద్‌కు చెందిన శ్రీ పరకాలన్ “శ్రీ రామానుజాచార్యులు - వైభవం” అంశంపై ప్రసంగించారుభక్తి ఉద్యమం ద్వారా సమాజ సంస్కరణకు శ్రీకారం చుట్టిన మహానుభావుడు రామానుజాచార్యులని చెప్పారుకులమత భేదాలకు అతీతంగా సమానత్వాన్ని ప్రోత్సహించిన ఆచార్యుడిగా ఆయన నిలిచారని వివరించారు.


తదుపరి తిరుపతికి చెందిన శ్రీ రస్వతి ప్రసాద్ బృందం ఆలపించిన సంకీర్తనలు భక్తులను ఆకట్టుకున్నాయి.


 కార్యక్రమంలో ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ శ్రీ పురుషోత్తం మరియు భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments