12.4.26

విద్యా జ్యోతి వెలిగించిన మహాత్మా జ్యోతిబా పూలే : టిటిడి అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి JYOTIBA PHULE









మానవ సమాజాన్ని సంస్కరణల వైపు నడిపించిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే అని టిటిడి అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారుతిరుపతి మహతి కళాక్షేత్రంలో శనివారం టిటిడి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే 199 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.


 సందర్భంగా ఆయన మాట్లాడుతూసమా పురోగతికి సామాజిక సంస్కరణలు అవసరమని గ్రహించిన జ్యోతిబా పూలే అణగారిన వర్గాల అభ్యున్నతికి విద్యజ్ఞానంఆత్మవిశ్వాసంస్వయం నియంత్రణ వంటి విలువలను పెంపొందించే దిశగా కృషి చేశారని తెలిపారుసమాజంలో అసమానతలను తొలగించడానికి విద్యనే ప్రధాన మార్గంగా భావించితన సతీమణి నుంచే విద్యా ప్రబోధాన్ని ప్రారంభించారని వివరించారుప్రతి కుటుంబంలో విద్యాభివృద్ధి ఉంటే వైరుధ్యాలు తగ్గుతాయని ఆయన చైతన్యం కల్పించారన్నారు. “గులాం గిరి” వంటి రచనల ద్వారా సామాజిక స్వేచ్ఛకు బాటలు వేసిన మహనీయుడని కొనియాడారుమహిళల్లో విద్యా చైతన్యం పెంపొందించడంలో ఆయన కృషి విశేషమని గుర్తు చేశారు.


 కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన అదనపు జిల్లా జడ్జి శ్రీమతి జిఅర్చన మాట్లాడుతూవిద్యా జ్యోతి వెలిగించిన మహనీయుడు జ్యోతిబా పూలే అని పేర్కొన్నారునేటి పరిస్థితుల్లో మహిళల పట్ గౌరవ భావం పెంపొందించడానికి బాల్యం నుంచే సరైన విలువలను బోధించాల్సిన అవసరం ఉందని సూచించారు.


ఏపీ సచివాలయ గెజిటెడ్ ఆఫీసర్స్ అధ్యక్షులు శ్రీ కె.వికృష్ణయ్ మాట్లాడుతూగ్రామీణ ప్రాంతాల్లో వివక్షను తొలగించడానికి విద్యే ప్రధాన మార్గమనిప్రతి కుటుంబంలో విద్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు.


అంతకు ముందు మహతి కళాక్షేత్రంలో శ్రీవారి చిత్రపటానికి పూజలు నిర్వహించిఅనంతరం మహాత్మా జ్యోతిబా పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారుటిటిడి ఉద్యోగులు జ్యోతిబా పూలే జీవిత చరిత్రను నాటక రూపంలో ప్రదర్శించారు సందర్భంగా 60 మంది ఉద్యోగులను మహాత్మా జ్యోతిబా పూలే అవార్డులతో సత్కరించారు.

సాంస్కృతిక కార్యక్రమాలు అలరించగాక్విజ్వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.


 కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవో (సంక్షేమంశ్రీ ఆనందరాజుడాఎన్భీమన్నమెడికల్ ఫీసర్ శ్రీమతి కుసుమ కుమారి తదితరులుఅధికారులుఉద్యోగులువిద్యార్థులు పాల్గొన్నారు.


No comments :
Write comments