1.4.26

మోహిని అలంకారంలో పల్లకిపై విహరించిన కోదండరాముడు – భక్తులకు కనువిందు mohini alamkaram






ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు మంగళవారం ఉదయం స్వామివారు మోహిని అలంకారంలో పల్లకిపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారుఉదయం 8 నుండి 10 గంటల వరకు  వాహనసే భక్తి భావంతో వైభవంగా జరిగిందిభజన బృందాల హారతులుకోలాటా మధ్య స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించారుభక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.


మోహిని అవతార వృత్తాంతం భాగవతంలో ఎంతో రమణీయంగా వర్ణించబడిందిసురాసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథిస్తారుచివరికి అమృతం లభించినప్పుడు దానిని పంచుకునే విషయంలో కలహం చెలరేగుతుంది కలహాన్ని నివారించి అసురులను మోహింపజేసి దేవతలకు అమృతాన్ని అందించేందుకు శ్రీహరి మోహిని రూపంలో అవతరించారుతన భక్తులు కానివారు మాయకు లోనవుతారనిభక్తులు మాత్రం  మాయను సులభంగా అధిగమించగలరని  మోహిని రూపం ద్వారా స్వామివారు సూచిస్తున్నారని పురాణాలు తెలియజేస్తున్నాయి.


వాహనసేవ అనంతరం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారుఇందులో పాలుపెరుగుతేనెచందనంకొబ్బరి నీటితో సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు.


 రాత్రి 7 గంటల నుండి 8.30 గంటల వరకు అత్యంత వైభవంగా గరుడసేవ జరగనుంది.


 కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతిసూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్యటెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

No comments :
Write comments