VIDEO
తిరుమలలోని
నా రాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సు వాసనలు వెదజల్లే రంగురంగుల పుష్ పాలతో భూలోక వైకుంఠాన్ని తలపిం చే రీతిలో అలంకరించిన దశావతార – అష్టలక్ష్మి మండపంలో శనివారం సా యంత్రం శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్ రారంభమయ్యాయి . ఏప్రిల్ 27 వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి .
2 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, అ ర టన్ను పండ్లు, 30 వేల కట్ ఫ్లవర్స్ తో 100 మం ది గార్డెన్ సిబ్బంది, 50 మంది ఎలక్ట్రిక్ సిబ్బంది కలి సి మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.
అదేవిధంగా శ్రీ శ్రీనివాస పద్మా వతి పరిణయం, గజ వాహనంపై విష్ణు మూర్తి, గజ లక్ష్మి, తామరపువ్వు పై విష్ణుమూర్తి, గోపాల కృష్ణు డు, అష్ట లక్ష్ముల రూపాలతో ఏర్ పాటు చేసిన విద్యుత్ అలంకరణలు భ క్తులను విశేషంగా ఆకట్టుకుంటున్ నాయి.
మొదటిరోజు వైశిష్ట్యం :
శ్రీ పద్మావతి పరిణయోత్సవాల్లో మొదటిరోజు అంటే వైశాఖశుద్ధ నవమి రోజైన శనివారంనాడు శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహిం చగా ఉభయనాంచారులు పల్లకిపై పరి ణయోత్సవ మండపానికి వేంచేపు చేశా రు.
వివిధ హంగులతో శోభిల్లుతున్న ఈ పెండ్లిమండపంలో నిత్య నూతన వధూ వరులైన శ్రీ స్వామివారికి, అమ్ మవార్లకు ఎదుర్కోలు, మాల పరివర్ తనం, పూలబంతులాట, నూతన వస్త్ర స మర్పణ కోలాహలంగా జరిగాయి. ఆ తరు వాత శ్రీ స్వామివారికి కొలువు ( ఆస్థానం) జరిగింది.
ఈ క్రతువుల అనంతరం వివిధ రాగ- తా ళ- వాయిద్యాల నడుమ స్వామి అమ్మవా ర్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరి గింది.
పిదప ఆర్జిత భక్తులకు వస్త్ర బహు మానం, ప్రసాద వితరణ జరిగింది. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సహితు డైన స్వామి అశేష భక్తజనం మధ్య ఊ రేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో తొ లిరోజు వివాహ వేడుక ఘనంగా ముగి సింది.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి. హెచ్. వెంకయ్య చౌదరి, డిప్యూ టీ ఈవో శ్రీ లోకనాథం, గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసు లు, ఇతర అధికారులు, విశేష సంఖ్ యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments