24.4.26

తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి parinayotsavams







తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో ఏప్రిల్‌ 25 తేదీ నుండి మూడు రోజుల పాటు జరుగనున్న శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలకు టిటిడి ఏర్పాట్లు పూర్తి చేసింది.

 

టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో పరిణయోత్సవ మండపాన్ని దశావతారంఅష్టలక్ష్ముల వంటి ఆధ్యాత్మిక రూపాలతో దాదాపు 100 మంది నిపుణులు  అలంకరిస్తున్నారని టిటిడి ఉద్యానవన డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు తెలిపారు.

 

పూణేకు చెందిన శ్రీ వేంకటేశ్వర రిలీజియస్ చారిటబుల్ ట్రస్ట్ రూ.30 లక్షలతో  వేదికను వైభవంగా ర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు.

 

మూడురోజులపాటు జరుగనున్న  వేడుకలో తొలిరోజు శ్రీ మలయప్పస్వామివారు గజవాహనంపైరెండవరోజు అశ్వవాహనంపైచివరిరోజు గరుడవాహనంపై వేంచేపు చేస్తారు.


మరోపక్కఉభయనాంచారులు ప్రత్యేక ల్లకీలలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు తరువాత కల్యాణమహోత్సవం కన్నులపండుగగా నిర్వహిస్తారు.

No comments :
Write comments