3.4.26

భక్తిరసంతో అలరించిన శ్రీ కోదండరాముని రథోత్సవం radhotsavam









ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.


ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన  రథోత్సవంలో శ్రీ సీతాలక్ష్మణ మేత కోదండరాములవారు రథాన్ని అధిష్టించి గ్రామ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారుభజన బృందాలు చెక్కభజనలుకోలాటాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత భక్తిరసమయం చేశాయిభక్తులు భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగుతూ అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు.


రథోత్సవానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యం విశేషంఆత్మ రథికుడురీరమే రథంబుద్ధి సారథిమనస్సు పగ్గంఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులని భావించిఆత్మఅనాత్మ వివేకాన్ని గ్రహించేందుకు  ఉత్సవం మార్గదర్శకంగా నిలుస్తుంది.


 కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరిజేఈవోలు శ్రీ వి వీరబ్రహ్మండా..శరత్డెప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతిటెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్ఇంజినీరింగ్ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments