25.4.26

శ్రీవారి సేవ కార్యకలాపాలపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష ttd addl eo





శ్రీవారి సేవ కార్యకలాపాలపై టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్వెంకయ్య చౌదరి శుక్రవారం తిరుమలలోని ప‌ద్మావ‌తి అతిథి గృహంలో గ‌ల‌ సుధర్మ స‌మావేశం మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు సంద‌ర్భంగా శ్రీవారి సేవకులకు సేవల కేటాయింపుభక్తులకు సేవలు అందించే విధానంపై ముందస్తు శిక్షణసంబంధిత‌ విభాగాల సిబ్బంది సేవకులతో నడుచుకోవాల్సిన విధానంసేవకుల నుండి  ఫిర్యాదులు అందితే తక్షణ పరిష్కారం వంటి అంశాలపై సమావేశంలో సమీక్షించారు.


సమావేశంలోని ముఖ్యాంశాలు


•  శ్రీ‌వారి సేవ‌కుల నుండి అత్యుత్తమ సేవ‌ల‌ను భ‌క్తుల‌కు అందించ‌డంలో భాగంగా సేవ అనంత‌రం సంబంధిత సేవ‌కుల అభిప్రాయాల‌నునుభ‌వాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఏమైనా స‌మ‌స్య‌లు ఉంటే అక్క‌డిక‌క్క‌డే ప‌రిష్క‌రించేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశం.


•  సేవకుల పనితీరును సమర్థత ఆధారంగా రేటింగ్ చేసే విధానం పార‌ద‌ర్శ‌కంగా అమలు.


•  సేవకుల ఫిర్యాదుల పరిష్కారం కోసం కేంద్రీకృత గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ప్రత్యేక ఫిర్యాదు నంబర్ ద్వారా తక్షణ పరిష్కార వ్యవస్థ తీసుకురావాలని నిర్ణ‌యం.


•  సంబంధిత‌ విభాగాలు సేవకులకు బాధ్యతలపై స్పష్టత ఇవ్వాలనిశ్రీ‌వారి సేవ‌కుల సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలి.


•  సత్సంగ కార్యక్రమాల్లో ప్రము సంగీత విద్వాంసులుఆధ్యాత్మి వక్తలను ఆహ్వానించి సేవాభావం, క్రమశిక్షణ పెంపొందించేలా శిక్షణ ఇచ్చేందుకు చర్య‌లు.


•  తిరుమలలో రద్దీ ప్రాంతాల్లో ఆచరణ నియమాలునైతికఆధ్యాత్మి విలువలను తెలియజేసే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయం.


•  భక్తులుసేవకులుఉద్యోగుల మానసిక ప్రశాంతత కోసం హీలింగ్ సెంటర్ ఏర్పాటుకు చ‌ర్య‌లు.


•  రిటైర్డ్ సీనియర్ అధికారులను శ్రీవారి సేవ పర్యవేక్షకులుగా వినియోగించే అంశంపై తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచన.


 సమావేశంలో సీపీఆర్వో డాక్ట‌ర్ టి.ర‌విడిప్యూటీ ఈవోలు శ్రీ లోక‌నాథంశ్రీ భాస్క‌ర్శ్రీ సోమ‌న్నారాయ‌ణ‌ఎస్టేట్ ఆఫీస‌ర్ శ్రీ వెంక‌టేశ్వ‌ర్లుశ్రీ ర‌మాకాంత్పీఆర్వో (ఎఫ్ఏసీకుమారి నీలిమ‌ఐటీ డిప్యూటీ జీఎం శ్రీ వెంక‌టేశ్ నాయుడుఅశ్వ‌నీ ఆసుప‌త్రి సివిల్ సర్జ‌న్ డాక్ట‌ర్ సుబ్బారెడ్డివీజీవో శ్రీ సురేంద్ర‌ఇత‌ర అధికారులు  పాల్గొన్నారు.

No comments :
Write comments