22.5.26

ఎస్వీ గోశాలలో నెయ్యి తయారీ కేంద్రం పనుల పరిశీలన ghee production





తిరుపతిలోని టిటిడి ఎస్వీ గోశాలలో నిర్మాణంలో ఉన్న నెయ్యి తయారీ కేంద్రం, సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ పనులను టిటిడి జేఈవో (వైద్యం, విద్య) డా. . రత్ బుధవారం పరిశీలించారు.


సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, టిటిడి ఈవో శ్రీ ఎం. రవిచంద్ర దేశాల మేరకు పెండింగ్ పనులను సమీక్షించామని తెలిపారు. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో చేపడుతున్న సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ పనులను మరియు చివరి దశలో ఉన్న నెయ్యి తయారీ కేంద్రం పెండింగ్ పనులు జూలై నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అధికారులను దేశించారు. ఎస్వీ గోశాలలో  రోజుకు సుమారు 2 వేల లీటర్ల పాలను ప్రాసెస్ చేసే సామర్థ్యంతో కేంద్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎస్వీ గోశాల నుండి సేకరించే పాలను వినియోగించి స్వామివారి కైంకర్యాలు, సేవల కోసం పాలు, పెరుగు, నెయ్యి తదితర ఉత్పత్తులను టిటిడి స్వయంగా తయారు చేసేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.


అదేవిధంగా, నెయ్యి తయారీ ప్లాంట్ పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయని, వెంటనే ట్రయల్ రన్ నిర్వహించి మిగిలిన పనులను  పూర్తి చేయాలని సూచించారు. పాలు ఇచ్చే దేశీయ ఆవులను మరింతగా సమీకరించేందుకు చర్యలు చేపట్టాలని, టిటిడి తరఫున చేపట్టాల్సిన నీరు, విద్యుత్, ఫ్యాన్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, లైటింగ్, సైన్ బోర్డులు తదితర మౌలిక వసతుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.


మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా మజ్జిగ, వెన్న తయారీ అనంతరం వెన్న నుండి నెయ్యి ఉత్పత్తి చేసే ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తు ర్పాట్లు చేయాలని సూచించారు. స్వామివారి ధూప, దీప, నైవేద్య కార్యక్రమాలకు వినియోగించే నెయ్యిని ఎస్వీ గోశాల నుండే సరఫరా చేసేలా పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.


యూనిట్ ద్వారా రోజుకు 2 వేల లీటర్ల పాల నుండి సుమారు 80 కిలోల నెయ్యి తయారు చేసే అవకాశం ఉందని, దశలవారీగా యూనిట్ సామర్థ్యాన్ని 10 వేల లీటర్ల వరకు పెంచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని జేఈవో వెల్లడించారు.


కార్యక్రమంలో టిటిడి ఎస్వీ గోశాల డైరెక్టర్ డా. ఏవీఎన్ శివకుమార్, ఎస్‌ఈలు శ్రీ వేంకటేశ్వర్లు, శ్రీ మనోహరం, ఈఈ శ్రీ ప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments