3.5.26

అన్నమయ్య కీర్తనల మధ్య శ్రీవారి దివ్య కల్యాణ మహోత్సవం kalyana mahotsavam


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 618 జయంతి ఉత్సవాలు శనివారం అన్నమయ్య జిల్లా తాళ్లపాకలో ఘనంగా ప్రారంభమయ్యాయితాళ్లపాకలోని ధ్యానమందిరం వద్ద ఉదయం శ్రీవారి దివ్య కల్యాణం కన్నులపండువగా జరిగింది.


ఉదయం 10 గంటలకు వేద పండితులు శ్రీదేవిభూదేవి సమేత శ్రీవారి త్సవమూర్తులను కల్యాణవేదికకు తీసుకువచ్చారుఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అర్చకు వేదమంత్రోచ్ఛారణలుమంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారుపుణ్యాహవచనంపవిత్ర హోమంకంకణధారణమాంగళ్యధారణమంగళాశాసనం వంటి ఘట్టాలతో కల్యాణం వైభవంగా జరిగిందిచివరిగా నక్షత్రహారతిమంగళహారతులతో కార్యక్రమం ముగిసింది.


టీటీడీ భక్తులకు మంచినీరుమజ్జిగప్రసాదాలు అందించగాఅనంతరం పెద్దసంఖ్యలో భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు.

అంతకుముందు ఉదయం 9 నుండి 10 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం నిర్వహించి భక్తులను ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్లారు.


సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు చెన్నైకు చెందిన డాతాళ్లపాక మీనలోచని సంగీత సభరాత్రి 7.30 గంటలకు కర్నూలుకు చెంది శ్రీమతి లక్ష్మీ మహేష్ బృందం హరికథ గానం నిర్వహించనున్నారు.


అన్నమయ్య విగ్రహం వద్ద ఊంజల్ సే వైభవం


రాజంపేటకడప రహదారిపై ఉన్న 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద నివారం సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు శ్రీవారి ఊంజల్ సే వైభవంగా జరుగనుంది సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య కీర్తనలను ఆలపించనున్నారుఅనంతరం రాత్రి 7.30 గంటలకు ప్రొద్దుటూరుకు చెందిన శ్రీ రమణయ్య బృందం హరికథ కార్యక్రమం నిర్వహించనుంది.


 కార్యక్రమంలో పలువురు అధికారులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments