2.5.26

పత్ర పుష్పాలతో శివార్చన… భక్తులకు దివ్యానుభూతి kapileswaraswamy vari temple






తిరుప‌తి శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో శుక్రవారం ప‌త్రపుష్ప‌యాగం వైభవంగా జ‌రిగింది.


తిరుపతి, 2026 మే 01: ఉద‌యం స్వామివారిని సుప్ర‌భాతంతో మేల్కొలిపిఅభిషేకం నిర్వ‌హించారుఉద‌యం 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు శ్రీ క‌పిలేశ్వ‌ర స్వామివారుశ్రీ కామ‌క్షి అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌కు న‌వ క‌ల‌శ స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హించారుఇందులో పాలుపెరుగుతేనెపంచామృతాభిషేకంచెరుకు ర‌సంకొబ్బ‌రినీళ్ళువిబూది, ప‌సుపుచంద‌నంల‌తో అభిషేకం చేశారు.


ఉద‌యం 10 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ప‌త్ర పుష్ప‌యాగ మ‌హోత్స‌వం జ‌రిగిందిఇందులో చామంతిగన్నేరుమొగలిసంపంగిజాజిరోజాతామ‌ర‌మ‌ల్లివృక్షిక‌న‌కాంబ‌రంల‌తో పాటు బిల్వ ప‌త్రంతుల‌సిప‌న్నీరు కుల‌తో స్వామిఅమ్మవార్లకు ప‌త్ర పుష్ప యాగం నిర్వహించారు.


ఆంధ్ర‌తెలంగాణ‌క‌ర్ణాట‌క‌ రాష్ట్రాల నుండి దాత‌లు 3 ట‌న్నులు పుష్పాలుపత్రాలు విరాళంగా అందించారుఇందులో 12 ర‌కాల‌ పుష్పాలు, 6 ర‌కాల ప‌త్రాలు ఉన్నాయి.


ఆల‌యంలో అర్చక పరిచారకుల వల్లఅధికార అనధికారుల వల్లభక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా ప‌త్ర పుష్పయాగం నిర్వహిస్తార‌ని అర్చ‌కులు తెలిపారు.

 కార్య‌క్ర‌మంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నగార్డెన్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు,  సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments