8.5.26

వైభవంగా శ్రీ నారాపుర వేంకటేశ్వర స్వామివారి రథోత్సవం radhotsavam




జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం నిర్వహించిన రథోత్సవం వైభవంగా సాగిందిఉదయం 07.30 గంటలకు వృషభలగ్నంలో స్వామివారు రథారోహణం చేసిఅనంతరం ఉదయం 08.30 గంటలకు ఆలయ మాడవీధుల్లో క్తులకు దివ్య దర్శనం ఇచ్చారు.


మంగళవాయిద్యాలుగోవింద నామస్మరణభజనలుకోలాటాల నడుమ సాగిన రథోత్సవం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుందిరథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడి తమ భక్తిశ్రద్ధలను చాటుకున్నారుస్వామివారి దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించుకున్న భక్తులు భక్తి పరవశులయ్యారు.


రథోత్సవానికి ఉన్న తాత్త్విక ప్రాధాన్యాన్ని పండితులు వివరించారుఆత్మ రథికుడుశరీరమే రథంబుద్ధి సారథిమనస్సు పగ్గంఇంద్రియాలే గుర్రాలువిషయాలే వీధులనే భావన ద్వారా ఆత్మానాత్మ వివేకం కలుగుతుందని తెలిపారురథోత్సవం భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించే మహోత్సవమని పేర్కొన్నారు.


 సందర్భంగా రాత్రి 07.00 గంటలకు అశ్వవాహనంపై స్వామివారు ఆల వీధుల్లో విహరించి భక్తులను నుగ్రహించనున్నారు.


 కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవో శ్రీమతి .  ప్రశాంతిసూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్యర్చకులుఅధికారులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments