16.6.26

కేంద్ర మంత్రి సమక్షంలో సీఎస్‌ఐఆర్-సీఎఫ్‌టీఆర్‌ఐతో టీటీడీ చారిత్రాత్మక ఒప్పందం mou


శ్రీవారి ప్రసాదా తయారీ, పంపిణీ ప్రక్రియలో అత్యున్నత స్థాయి భద్రత, నాణ్యత, పోషక విలువలను నిర్ధారించడంతో పాటు వాటి సంప్రదాయ స్వరూపాన్ని రిరక్షించేందుకు టీటీడీ, మైసూరుకు చెందిన CSIR-Central Food Technological Research Institute తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.


బెంగళూరులో నిర్వహించిన రెండు రోజుల RISE Conclave-2026 (Reasearch, Innovation, Start-ups And Entrepreneurship) సదస్సులో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, హార మరియు ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి సమక్షంలో ఒప్పందం జరిగింది. సదస్సులో టీటీడీ తరఫున ప్రోక్యూర్మెంట్ జీఎం శ్రీ ఉమా శంకర్ పాల్గొన్నారు. కాగా, దేశంలోని దేవాలయాలకు సంబంధించి తరహా ఒప్పందం కుదరడం ఇదే తొలిసారి కావడం విశేషం.


సందర్భంగా కేంద్ర మంత్రి పరిశోధనలు, ఆవిష్కరణలు, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించాలని, తయారీ సామర్థ్యాలను పెంపొందించాలని పిలుపునిచ్చారు.


ఒప్పందం ద్వారా కలిగే ప్రయోజనాలు


•  నాణ్యత, భద్రతకు మరింత ప్రాధాన్యం:


ముడి పదార్థాల కొనుగోలు నుంచి ప్రసాదాల తయారీ, పంపిణీ వరకు కఠినమైన నాణ్యత ప్రమాణాలు, ప్రామాణిక విధానాలు అమలు చేస్తారు.


•  ఆధునిక నిల్వ, పరీక్షా వ్యవస్థలు:


నిల్వ, కొనుగోలు, పరీక్షల ప్రక్రియల్లో శాస్త్రీయంగా నిర్ధారిత సాంకేతిక పద్ధతులను ప్రవేశపెట్టి కలుషిత ప్రమాదాలను తగ్గిస్తారు.


•  ప్రసాదాల నిల్వ కాలం పెంపు:


రుచి, నాణ్యత, సంప్రదాయ విలువలకు భంగం కలగకుండా ప్రసాదాల నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక ప్యాకేజింగ్, పరిశోధన చర్యలు చేపడతారు.


•  సిబ్బందికి ప్రత్యేక శిక్షణ:


టీటీడీ ఆహార విశ్లేషకులు, సంబంధిత సిబ్బందికి ఆధునిక పరీక్షా విధానాలు, నమూనాల సేకరణ, కలుషిత పదార్థాల గుర్తింపు, నెయ్యి స్వచ్ఛత నిర్ధారణ వంటి అంశాల్లో శిక్షణ అందిస్తారు.


•  శాస్త్రవేత్తల ప్రత్యక్ష సహకారం:


సీఎస్‌ఐఆర్-సీఎఫ్‌టీఆర్‌ఐ సీనియర్ శాస్త్రవేత్తలు టీటీడీ కేంద్రాలను క్రమం తప్పకుండా సందర్శించి సాంకేతిక సూచనలు, పరిశోధన ఆధారిత సహకారం అందిస్తారు.


ఒప్పందం ద్వారా శ్రీవారి ప్రసాదాల నాణ్యత, భద్రత, పోషక విలువలు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవడంతో పాటు భక్తులకు మరింత విశ్వసనీయమైన సేవలు అందించే అవకాశం కలుగనుంది.


No comments :
Write comments