14.5.25

Annamacharya Was A Social Reformer - Scholars








While describing the great literary works of Saint Poet Sri Tallapaka Annamacharya as incredible scholars univocally advocated he also stood as a social reformer during his times.


The 617th birth anniversary celebrations of Sri Tallapaka Annamacharya were held at the Annamacharya Kalamandiram in Tirupati  on Tuesday.

Renowned scholar Acharya Sri Sarvottama Rao presided over the literary conference organized on this occasion. 

He said that Annamayya's Sankeertans were helpful for the development of society and many Telugu poets have drawn inspiration from his literature.  

Annamayya's descendants Sri Hariharayanacharya, speaking on the topic "Srivari Temple Annamayya Seva Kankarya", said that Annamayya was a devotee who had shown devotion to Srivaru since childhood. He said that Annamayya has introduced Kalyanotsavam and other services in the Srivari Temple which were being observed even today. 

Another scholar Dr. Bathela Sriramulu, said that Annamacharya considered devotion to be the best among the tools for achieving salvation.   

Later in the evening Annamacharya project artist Smt. Bullemma and team performed devotional vocal.

Later, Sri Purushottam and group from Tirupati presented Harikatha.

TTD Annamacharya Project Director Dr Medasani Mohan, Program Assistant Smt. Latha, other officials and a large number of denizens participated in this program.

అన్నమయ్య సామాజిక కవి : ఆచార్య కె.సర్వోత్తమరావు annamaiah


















అన్నమయ్య సాహిత్యం విలక్షణమైందని, వారిని సామాజిక కవిగా, ఆలయకవిగా, అనుభూతి కవిగా పేర్కొనవచ్చని ఎస్వీయూ విశ్రాంతాచార్యులు ఆచార్య కె.సర్వోత్తమరావు అన్నారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 617వ జయంతి కార్యక్రమాలు మంగళవారం రెండో రోజుకు చేరుకున్నాయి.

ఈ సందర్భంగా నిర్వహించిన సాహితీ సదస్సుకు ఆచార్య సర్వోత్తమరావు అధ్యక్షత వహించారు . ఆయన "అన్నమయ్య పదాలలో గ్రామీణ చిత్రణ" అనే అంశంపై ప్రసంగిస్తూ, అన్నమయ్య తన సంకీర్తనల్లో గ్రామీణ జీవితంలోని మాధుర్యాన్ని, జానపదాలను, గ్రామాల్లోని సామెతలను, నానుడులను పొందుపరిచారని తెలియజేశారు.
సమాజ వికాసానికి అన్నమయ్య కీర్తనలు ఎంతో ఉపకరిస్తాయని చెప్పారు. తెలుగు కవులు ఎందరో అన్నమయ్య సాహిత్యం నుంచి స్ఫూర్తి పొందారన్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషా సాహిత్యాల్లో తగిన పరిజ్ఞానం కలిగి వైష్ణవ సంప్రదాయాలు తెలిస్తే గాని అన్నమయ్య సాహిత్యం అవగతం కాదన్నారు.
అన్నమయ్య వంశీయులు శ్రీ హరిహరాయణాచార్యులు "శ్రీవారి ఆలయం అన్నమయ్య సేవా కంకర్యాలు" అనే అంశంపై ప్రసంగిస్తూ, బాల్యం నుంచి శ్రీవారి పట్ల భక్తిని వెల్లడించిన భక్తుడు అన్నమయ్య అన్నారు. నేటికీ శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం తదితర సేవలను అన్నమయ్య ప్రవేశపెట్టారని చెప్పారు. దైవానికి తప్ప మరెవ్వరికీ తలవంచని ధైర్యం అన్నమయ్య సొంతమని, అన్నమయ్య వ్యక్తిత్వంలోని వివిధ ఉత్తమ కోణాలను వివరించారు.
తిరుపతికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు డాక్టర్ బత్తెల శ్రీరాములు "అన్నమయ్య సంకీర్తనలు వైష్ణవాచార్యులు" అనే అంశంపై ప్రసంగించారు . అన్నమాచార్యులు మోక్ష సాధన సామగ్రిలో భక్తిని ఉత్తమోత్తమంగా భావించారని తెలిపారు. భక్తిని, శరణాగతిని ఆలంబనగా చేసుకుని ఆధ్యాత్మికంగా పురోగమించడమే కాకుండా, తమ ఆధ్యాత్మిక కీర్తనలతో లోకానికి తరుణోపాయం చాటి చెప్పారని అన్నారు. నవవిధ భక్తిమార్గాలు, గీతాచార్యుని ఉపదేశాలను ప్రమాణంగా చేసుకుని ఆధ్యాత్మిక యానం సాగించారని వివరించారు.
సాయంత్రం 6 గంటల నుండి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి బుల్లెమ్మ బృందం గాత్ర సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తిరుపతికి చెందిన శ్రీ పురుషోత్తం బృందం హరికథ గానం చేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ మేడసాని మోహన్, ప్రోగ్రాం అసిస్టెంట్ శ్రీమతి లత,ఇతర అధికారులు, విశేష సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

13.5.25

ఏపీ, తెలంగాణ నేతల సిఫార్సు లేఖల పునరుద్ధరణకు తాత్కాలిక నిర్ణయం: టిటిడి- Public Representatives




 తిరుమల శ్రీవారి దర్శనార్థం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖల పునరుద్ధరణకు మాత్రమే తాత్కాలికంగా టిటిడి నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 15వ తేదీ నుండి సదరు నేతల సిఫార్సు లేఖలను మాత్రమే టిటిడి అనుమతించనుంది. అయితే మిగిలిన వారి సిఫార్సు లేఖల పై అంతకు ముందు తీసుకున్న నిర్ణయం కొనసాగుతుంది . నియమావళి ప్రకారం అనుమతి పొందిన భక్తులకు ఈ నెల 16వ తేదీ నుండి శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. 

Annamaiah's Keerthanas Should Reach the Grassroots






The 617th birth anniversary of Saint Poet Sri Tallapaka Annamacharya was celebrated in a grand manner at Annamacharya Kala Mandiram in Tirupati under the joint auspices of TTD's Annamacharya Project and HDPP.


Dr. Medasani Mohan, Special Officer of the Annamacharya Project, emphasized the need to take Annamacharya Keerthanas to the grassroot level and involve youth in them. 

He praised Annamayya’s contribution in spreading the glory of Sri Venkateswara through his compositions and urged people to celebrate the occasion with devotion.

Similarly at Tallapaka, in Rajampet near the 108-feet Annamayya statue also special programs were observed on the occasion.

TTD officials and a large number of denizens participated in these events.

శ్రీ తాళ్ల‌పాక అన్న‌మాచార్య 617వ జ‌యంతి వేడుకలు -annamaiah










అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌ను క్షేత్ర‌స్థాయికి తీసుకెళ్లాల‌ని అన్న‌మాచార్య ప్రాజెక్టు ప్ర‌త్యేక అధికారి డా. మేడ‌సాని మోహ‌న్ అన్నారు. టీటీడీ అన్న‌మాచార్య ప్రాజెక్టు, హిందూ ధార్మిక సంస్థ‌ల ఆధ్వ‌ర్యంలో శ్రీ తాళ్ల‌పాక అన్న‌మాచార్య 617 జయంతి వేడుక‌లు తిరుప‌తి అన్న‌మ‌య్య క‌ళా మందిరంలో సోమ‌వారం వైభ‌వంగా నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా డా. మేడ‌సాని మోహ‌న్ మాట్లాడుతూ అన్న‌మాచార్య కీర్త‌న‌ల్లో యువ‌త‌ను భాగ‌స్వామ్యం చేయాల‌ని కోరారు. శ్రీ‌వారి వైభ‌వాన్ని త‌న కీర్త‌న‌ల ద్వారా విశ్వ‌వ్యాప్తం చేశార‌ని కొనియాడారు. అన్న‌మ‌య్య జ‌యంతి వేడుక‌ల‌ను భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకోవాల‌ని సూచించారు.
అంత‌క‌ముందు ఉద‌యం 9 గంట‌ల‌కు అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారుల ఆధ్వ‌ర్యంలో స‌ప్త‌గిరి కీర్త‌న‌ల గోష్ఠిగానం చేపట్టారు. అనంత‌రం తిరుప‌తికి చెందిన శ్రీ‌మ‌తి జి.లావ‌ణ్య బృందం `హ‌రిస‌ర్వాత్మ‌కుడు, ఇంక‌నైనా క‌రుణించ‌వేమ‌య్యా, ప‌లువిచార‌ములేల‌, ఏవంద‌ర్శ‌య‌సి త‌దిత‌ర కీర్త‌న‌లను సంగీత స‌భ‌లో ఆల‌పించారు.
అనంత‌రం శ్రీ‌మ‌తి రెడ్డెమ్మ బృదం రాజ‌సూయ‌యాగం అనే హ‌రిక‌థ‌ను వినిపించారు. సాయంత్రం శ్రీ‌మ‌తి ఎస్‌.సుగుణ‌మ్మ బృందం సంగీత స‌భ‌, తిరుప‌తికి చెందిన శ్రీ‌మ‌తి వ‌న‌జ కుమారి బృందం హ‌రిక‌థ‌ను వినిపించ‌నున్నారు.
తాళ్ల‌పాక‌లో....
తాళ్ల‌పాక‌లోని ధ్యాన‌మందిరంలో ఉద‌యం 9 గంట‌ల‌కు అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారుల‌చే స‌ప్త‌గిరి సంకీర్త‌న‌ల గోష్ఠిగానం నిర్వ‌హించారు. అనంత‌రం ఉద‌యం 10.30 గంట‌ల‌కు శ్రీ‌నివాసం క‌ళ్యాణం నిర్వ‌హించారు. సాయంత్రం 6 గంట‌ల‌కు సంగీత స‌భ‌, హ‌రిక‌థ కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌నున్నాయి.
రాజంపేట‌లో...
రాజంపేట‌లో 108 అడుగుల అన్న‌మ‌య్య విగ్ర‌హం వ‌ద్ద సాయంత్రం ఊంజ‌ల్ సేవ‌, హ‌రిక‌థ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ అధికారులు, భ‌క్తులు విశేష సంఖ్య‌లో పాల్గొన్నారు.

ఘనంగా శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం Govindaraja swamy






వైశాఖ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం సోమవారం వైభవంగా జరిగింది. 


ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ఆలయం నుండి శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి, ఆండాల్‌ అమ్మవారు, శ్రీకృష్ణస్వామి, విష్వక్సేనులవారు తొమ్మిది మంది దేవేరులతో ఊరేగింపుగా తనపల్లి రోడ్డులో గల పొన్నకాల్వ మండపానికి ఊరేగింపు చేరుకున్నారు.

అనంతరం అక్కడ ఉదయం 9 నుండి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్ళతో స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు అభిషేకం చేశారు. అనంతరం సేవాకాలం, శాత్తుమొర, ఆస్థానం నిర్వహించారు. 

సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు ఊంజలసేవ, ఆస్థానం చేపట్టారు. ఆ తరువాత సాయంత్రం 5 గంటలకు శ్రీగోవిందరాజస్వామివారు అక్కడినుండి బయలుదేరి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.

గోవిందరాజస్వామివారు వచ్చే సమయంలో అమ్మవారి ఆలయంలో ఒక తలుపు మూసి ఉంచుతారు. బావగారైన గోవిందరాజస్వామివారు వచ్చారని పద్మావతి అమ్మవారు లోపలి నుండి ఆసక్తిగా తొంగి చూస్తారని, అందుకే ఆలయం ఒక తలుపు మూసి ఉంచుతారని పురాణాల ద్వారా తెలుస్తోంది. అక్కడ పూజాధికాలు ముగించుకుని గోవిందరాజస్వామివారు ఊరేగింపుగా ఆలయానికి బయలుదేరారు. రాత్రి 9.30 గంటలకు తిరిగి శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకోవడంతో పొన్నకాల్వ ఉత్సవం ముగుస్తుంది. 

ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయర్, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయంగార్లు, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈఓ శ్రీ ముని కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ లు శ్రీ ఎ.వి.శేషగిరి, చిరంజీవి, ఆలయ ఇన్స్పెక్టర్ లు యు.ధనుంజయ, రాధాకృష్ణ ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Ponnakalva Utsavam Held









Sri Ponnakalva Utsavam was observed in Sri Govindaraja Swamy temple in Tirupati on Monday.


Sri Govindaraja, flanked by Sridevi and Bhudevi was taken to Ponnakalva located in Tanapalle Road. Sri Krishna Swamy, Andal and Chakrattalwar also accompanied the procession.

Later Snapanam was performed here. From there Sri Govindaraja reached Tiruchanoor before returning to Govindaraja Swamy temple.