3.7.25

సాక్షి ఛానెల్లో ప్రసారమైన ''తిరుమలలో తన్నుకున్న టీటీడీ సిబ్బంది'' అనే వార్తను టీటీడీ ఖండిస్తోంది‌. ఇది పూర్తిగా వాస్తవ దూరం




జూన్ 29వ తేది మధ్యాహ్నం తిరుమల లోని అఖిలాండం వద్ద ఎటువంటి లైసెన్స్ లేకుండా అనధికారికంగా ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తూ భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్న నేపథ్యంలో అక్కడే విధుల్లో ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు సదరు  ఫోటోగ్రాఫర్ ను ప్రశ్నించిన క్రమంలో కెమెరాను వేరే వారికి ఇచ్చి పంపినందుకు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు కెమెరా ను తెప్పించమన్నందుకు ఫోటోగ్రాఫర్ అసభ్యకరమైన భాషను సిబ్బందిపై వాడటం, ఒకరినొకరు మాట మాట పెంచుకొని గొడవ పడినట్టుగా తెలిసింది. 

గొడవను పెంచుకుంటూ ఇద్దరు ఆస్థాన మండపంలొని షాపు నంబర్: 96 వద్ద గొడవపడిన విషయం సీసీ కెమెరాలో రికార్డైంది.
ఈ ఘటనలో షాప్ నెంబరు: 96, (ఫోటో స్టూడియో) లో పనిచేస్తున్న ఫోటోగ్రాఫర్ ను తాను ప్రవర్తించిన తీరు పై వివరణ కోరడమైనది. 
అలాగే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు ప్రవర్తించిన తీరు నియమాలకు విరుద్ధంగా ఉండడంతో అతనిని తిరుమల నుండి విధుల నుంచి తప్పించి తిరుపతికి పంపించడం జరిగింది.
వాస్తవాలు ఇలా ఉండగా ఈ ఘటనను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేయడం భావ్యం కాదు. 

బిగ్, జనతా క్యాంటిన్ లలో నాణ్యమైన ఆహార పదార్ధాలను అందించాలి : టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు quality food





తిరుమలలో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు బిగ్, జనతా క్యాంటిన్లలో నాణ్యమైన ఆహార పదార్ధాలు అందించాలని టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు కోరారు. టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో గుర్తింపు ఉన్న హోటళ్ల నిర్వాహకులతో బుధవారం టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఈవో సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా ఈవో మాాట్లాడుతూ, శ్రీవారి దర్శనం కోసం ప్రపంచ వ్యాప్తంగా భక్తులు వస్తుంటారని, వారికి సేవా దృక్పధంతో నాణ్యమైన ఆహార పదార్థాలు, పరిశుభ్రత, లాభాపేక్ష లేకుండా నిర్ధేశించిన ధరలకు అందించాలన్నారు. తిరుమలలో బిగ్, జనతా క్యాంటిన్ల నిర్వహణ కోసం గత నెల 23వ తేదీ నోటిఫిషన్ జారీ చేశారు. సదరు ఈవోఐ సంబంధించిన సందేహాలపై గుర్తింపు ఉన్న హోటళ్ల నిర్వాహకులు తమ  ఆసక్తిని వ్యక్తం చేసేందుకు (EOI)/  ఫ్రీ బిడ్ మీటింగ్ ను టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు, టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్. వెంకయ్య చౌదరి నిర్వహించారు.

తిరుమలలో బిగ్, జనతా హోటళ్ల నిర్వహణలో  నాణ్యత ప్రమాణాలు, పరిశుభధ్రత పాటించాలని, లాభాపేక్ష లేకుండా నిర్దేశించిన ధరల ప్రకారం ఆహార పదార్ధాలను అందించాలని వారిని ఈవో, అదనపు ఈవో కోరారు. నిర్థారించిన నియమాలకు లోబడి బిగ్, జనతా క్యాంటిన్ లో కేటాయింపు ఉంటుందని ఈ సందర్భంగా చెప్పారు. 

ఈ సమావేశంలో బిగ్, జనతా హోటళ్ల నిర్వహణలో టెండర్ ప్రాసెస్ మరియు తదితర నియమ నిబంధనలను గుర్తింపు, ఆసక్తి ఉన్న హోటళ్ల నిర్వాహకులు నివృత్తి చేసుకున్నారు. హోటళ్ల నిర్వాహకులు పలు సందేహాలు వ్యక్తం చేయగా వాటిని టిటిడీ ఈవో, అదనపు ఈవో నివృత్తి చేశారు.

ఈ సమావేశంలో అదనపు ఎఫ్.ఏ.ఓ శ్రీ రవి ప్రసాదు, తిరుమల ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ కె. వెంకటేశ్వర్లు, ఆసక్తి , గుర్తింపు ఉన్న పలు హోటళ్ల నిర్వాహకులు పాల్గొన్నారు.

Sri Alluri Sitarama Raju 128th Birth Jayanthi on 4th July




TTD is making elaborate arrangements to observe the 128th birth anniversary of freedom fighter Sri Alluri Sitarama Raju on July 4.

The event will be organized by the TTD Welfare Department at Annamacharya Kalamandiram from 10.30 AM onwards.
The arrangements are being supervised by Dy EO (Welfare) Sri Ananda Babu.

జూలై 04న అల్లూరి సీతారామ రాజు 128వ జయంతి వేడుకలు




జూలై 04న అల్లూరి సీతారామ రాజు 128వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు టిటిడి ఏర్పాట్లు చేపట్టింది.  అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10.30 గం.లకు ఈ వేడుకలను  టిటిడి వెల్పేర్ డిపార్ట్మెంట్ నిర్వహించనుంది.


ఈ సందర్భంగా స్వాగతోపన్యాసం, ప్రార్థన, పూజ, జ్యోతి ప్రజ్వలన, వక్తల ఉపన్యాసం, అతిథులకు సన్మానం తదితర కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ ఏర్పాట్లను టిటిడి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సంక్షేమం) శ్రీ ఎ. ఆనందబాబు పర్యవేక్షిస్తున్నారు

భక్తుల సేవలకు ఆటంకం కల్గిస్తే చర్యలు తప్పవు - టిటిడి

 




శ్రీవారి భక్తులకు సేవలు అందించే కాంట్రాక్ట్ ఉద్యోగులు విధులను బహిష్కరించి నిరసనలకు దిగితే చర్యలు తప్పవని టిటిడి పేర్కొంది. కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ న్యాయమైన కోరికలను సదరు శాఖాధిపతులతో చర్చించి పరిష్కరించుకోవాలని కోరింది. న్యాయమైన కోర్కెలను తీర్చడానికి యాజమాన్యం సదా సంసిద్ధంగా ఉందని పేర్కొంది. పారిశుధ్ద్యం, ఆరోగ్యం తదితర శాఖలలో సంబంధిత కాంట్రాక్ట్ ఉద్యోగులు విశేషంగా సేవలు అందిస్తున్నారని, భక్తులకు ఇబ్బందులకు గురిచేసే చర్యలు తీసుకోవద్దని కోరింది. భక్తుల సేవలకు ఉద్యోగులు ఆటంకం కల్గించే చర్యలను నిషేధించే ముఖ్యమైన సేవల నిర్వహణ చట్టం ( ఎస్మా) టిటిడిలో అమలులో ఉందని, సదరు నిబంధనలను ఉద్యోగులు గుర్తు చేసుకోవాలని టిటిడి పేర్కొంది.

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఆధ్యాత్మిక సంస్థలో విధులను బహిష్కరించడం సరికాదని సూచించింది. నిబంధనలను ఉల్లంఘించి సమ్మెబాట పడితే ఎస్మా చట్టాన్ని అమలు చేస్తామన్నారు. ఎస్.ఎల్.ఎస్.ఎం.పీ.సీ సంస్థతోపాటు కాంట్రాక్ట్, పలు సొసైటీలలో ఉద్యోగులు పనిచేస్తున్నారని, సదరు ఉద్యోగులు విధులను బహిష్కరిస్తే ఎస్మా చట్టం ప్రకారం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
గతంలో టిటిడిలో విధులను బహిష్కరణ చేసినా మానవతా దృక్పథంతో తిరిగి విధుల్లోకి తీసుకోవడం జరిగింది. ఈసారి విధుల నుండి తొలగించాక విధులను బహిష్కరించిన వారిని ఎలాంటి పరిస్థితుల్లో తిరిగి చేర్చుకోరని టిటిడి తెలిపింది.
టిటిడిలో భక్తులకు సేవలు అందించే ఉద్యోగులు ధర్నాలు చేయడం, నిరసన నోటీసులు ఇవ్వడం, ఊరేగింపులు చేయడం చట్టప్రకారం నిషేధం. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా, ఉద్యోగుల విధులకు టిటిడితో సంబంధం లేని బయట వ్యక్తులు ఆటంకం కల్గిస్తే చట్టపరమైన క్రిమినల్ చర్యలకు వెనుకాడమని హెచ్చరించింది.
రోగుల వైద్య సేవలను బహిష్కరిస్తే చర్యలు తప్పవు- స్విమ్స్ డైరెక్టర్ శ్రీ ఆర్వీ కుమార్
స్విమ్స్ లో విధులు నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ శ్రీనివాస కార్పోరేషన్ లోని కాంట్రాక్ట్ ఉద్యోగులు గత కొంత కాలంగా పలు రకాల కోరికలను కోరుతూ విధులను బహిష్కరించేందుకు సిద్ధపడుతున్నారని , టిటిడి యాజమాన్యం చాలా సామరస్యంగా పరిష్కరించాలని ఉందన్నారు. సదరు ఉద్యోగులు సంబంధిత శాఖాధిపతులతో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు.
స్విమ్స్ లో ఎస్మా చట్టం అమలులో ఉన్నందున సమ్మె నోటిస్ ఇవ్వడం చట్టవిరుద్ధమన్నారు. వైద్య సేవలకు ఆటంకం కల్గిస్తే విధుల నుండి తొలగించే నిబంధన ఉందని, తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. విధులను బహిష్కరించి సమ్మెకు దిగితే ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. స్విమ్స్ తో సంబంధం లేని బయట వ్యక్తుల ప్రమేయంతో నిరసనలకు దిగితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. విధులను బహిష్కరించినందుకుగాను, ఒకసారి ఉద్యోగం తొలగించాక, సదరు ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోరనే విషయాన్ని గమనించాలని స్విమ్స్ డైరెక్టర్ ఉద్యోగులను కోరారు.భక్తుల సేవలకు ఆటంకం కల్గిస్తే చర్యలు తప్పవు - టిటిడి

Strict Action Against Disruption of Devotees Servcies - TTD




The Tirumala Tirupati Devasthanams has warned that if contract employees abstain from duties and participate in protests, strict action will be initiated against them for affecting devotees services. 
TTD stated that employees should resolve their genuine issues through discussions with the concerned departmental heads. The management is always willing to consider and address their legitimate demands.
TTD acknowledged that contract workers are rendering valuable services, especially in departments like sanitation and healthcare. However, they urged employees not to take any action that would cause inconvenience to the pilgrims. The Essential Services Maintenance Act (ESMA), which prohibits disruption of key services, is in force in TTD, and employees were reminded to adhere to its provisions.
It was emphasized that abstaining from duties in a globally renowned spiritual institution is inappropriate. If employees violate rules and go on strike, ESMA will be implemented. Employees working under agencies such as SLSMPC and other societies will also face alternative arrangements under the ESMA Act if they go on strike.
TTD reminded that in the past, it had shown a humanitarian approach by reinstating those who abstained from duties. However, this time, if any employee is removed from service due to absenteeism, they will not be reinstated under any circumstances.
TTD clarified that protests, rallies, and issuing strike notices by employees involved in pilgrim services are legally prohibited. Violations will attract action. 
Similarly, if any outsider not related to TTD interferes in employee duties, legal action will be initiated against them.
SVIMS Director Dr. R.V. Kumar said that contract workers under Sri Lakshmi Srinivasa Corporation at SVIMS have been planning to abstain from duties citing various demands. 
He stated that the TTD management is keen to resolve these issues in an amicable manner and urged employees to discuss matters with the concerned departmental heads and warned that participating in strikes could lead to their job loss.
Once an employee is terminated for abstaining from duties, they will not be reinstated under any circumstances, he asserted.

క‌న్నుల‌పండుగ‌గా పుష్పయాగం Pushpa Yagam







తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో బుధవారం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 9.30 - 11.30 గం.ల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. అనంతరం  మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 4 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది.


గత  బ్ర‌హ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకులు, అధికార, అనధికారులు, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 12 రకాల సాంప్రదాయ పుష్పాలు, తుల‌సి, మ‌రువం, ద‌మ‌నం, బిల్వం, ప‌న్నీరాకు వంటి 6 రకాల పత్రాలు కలిపి మొత్తం 3 టన్నుల పుష్పాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి పుష్పయాగం నిర్వహించారు. ఈ పుష్పాలను ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి దాతలు విరాళంగా అందించారు. సాయంత్రం 6 గంటలకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఉద్యానవ‌న‌ విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్‌ శ్రీ శ్రీనివాసులు, ఏఇవో శ్రీ గోపినాథ్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.