ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో దీనికి ఆణివార ఆస్థానం అని పేరు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం నాటి నుండి టీటీడీ ఆదాయ వ్యయాలు, నిల్వలు, వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్ను మార్చి – ఏప్రిల్ నెలకు మార్చారు.
శ్రీగోవిందరాజస్వామివారిఆలయం …..
శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని వేంచేపు చేసి సాయంత్రం ఆస్థానం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ పుండరీక వల్లి అమ్మవారి ఆలయం నుండి నూతన వస్త్రాలను విమాన ప్రదక్షణగా తీసుకువచ్చి శ్రీ గోవిందరాజస్వామివారికి సమర్పించారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్.శాంతి, ఏఈవో శ్రీ భాస్కర నారాయణ చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
శ్రీకోదండరామాలయంలో...
శ్రీ కోదండరామాలయంలో శుక్రవారం సాయంత్రం ఆలయంలోని గరుడాళ్వార్ ఎదురుగా శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండరాములవారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ప్రత్యేకంగా ఆస్థానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఏ.ఎం. సురేష్ బాబు, శ్రీ బి.హరికృష్ణ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
స్థానిక ఆలయాల్లో నారాయణవనం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం , కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాల్లో ఆణివార ఆస్థానం నిర్వహించారు.
No comments :
Write comments