Featured Post

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ pavitrotsavams

తిరుమల శ్రీవా రి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం శాస్త్రోక్ తంగా ప‌విత్ర సమర్పణ జరిగింది . ఈ సందర్భంగా ఉదయం యాగశాల...

25.8.26

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ pavitrotsavams









తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం శాస్త్రోక్తంగా ప‌విత్ర సమర్పణ జరిగింది.

ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం వేద ఘోష, మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవ మూర్తులకు, జ‌య‌విజ‌యుల‌కు, గ‌రుడాళ్వారుకు, వ‌ర‌ద‌రాజ‌స్వామివారికి, వ‌కుళమాత అమ్మ‌వారికి, ఆనంద నిల‌యం, యాగ‌శాల, విష్వ‌క్సేనులవారికి, యోగ‌న‌ర‌సింహ‌స్వామి వారికి, భాష్య‌కార్ల‌కు, పోటు తాయారుకు, ధ్వజస్తంభం, బ‌లిపీఠం, శ్రీభూవరాహస్వామివారికి, శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి పవిత్రమాలలు సమర్పించారు.

అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.

పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.

చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీస్వామివారి ఉత్సవమూర్తులకు కావలసిన పవిత్రాలు చేయడానికిగాను శ్రేష్టమైన జాతి పత్తి మొక్కలను అత్యంత పవిత్రమైన దైవమొక్కగా భావించే తులసి పెంచడానికి ఉపయోగించే పెరటి భూమిలో పెంచడం విశేషం. పవిత్రాలను తయారు చేయడానికి 20 మూరల పట్టుదారం గానీ లేదా 200 మూరల నూలుదారం గానీ ఉపయోగిస్తారు. ఈ దారాలకు తెలుపుతో పాటు నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులు అద్దకం చేస్తారు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

24.8.26

₹17 Lakhs Donation to TTD




Sri Vinod, a resident of Rentapalla village in Palnadu district, donated Rs.17 lakh to the TTD Sri Venkateswara Annaprasadam Trust on Sunday.

The donor handed over the donation DD to Srivari Temple Dy EO Sri Lokanatham at the Ranganayakula Mandapam in the temple.

TTD Board Member Sri Nannapaneni Sadashiva Rao participated in the programme.

ANKURARPANAM HELD FOR ASHTAANDHANA MAHA SAMROKSHANAM AT DEVUNI KADAPA TEMPLE




The Ankuraarpanam for the renovation and Ashtabandhana Maha Samprokshanam of Sri Lakshmi Venkateswara Swamy Temple at Devuni Kadapa was performed as per Agama traditions on Sunday evening.

The rituals included Vastu Shanti, Mrutsangrahanam, Kumbharadhana and Ankuraarpanam, amidst Vedic chants.

On August 24, Vedic rituals including Shanti Homam, Kumbhasthapana and Panchagni Pranayanam will be performed.

On August 25, rituals including Ekashiti Kalasa Snapana, Murti Homam and Ashtabandhanam will be conducted, followed by Shayadhivasam and Shanti Homam in the evening.

On August 26, after the morning rituals, Maha Poornahuti and Maha Samprokshanam will be performed from 9.45 am to 11.30 am under Shravana Nakshatram and Tula Lagnam.

Devotees will be allowed darshan of Sri Lakshmi Venkateswara Swamy after completion of the Maha Samprokshanam.

Deputy EO Smt. A. Prashanthi, AEO Sri Ravi, Superintendent Sri Hanumanthaiah, Temple Inspector Sri Eswar Reddy and temple priests participated in the programme.

దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వైభవంగా జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణకు అంకురార్పణ devuni kadapa




దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ మహోత్సవానికి ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఆగమోక్త వైదిక మంత్రోచ్ఛారణల నడుమ వాస్తుశాంతి, మృత్సంగ్రహణం, కుంభారాధన, అంకురార్పణ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.


ఆగస్టు 24న ఉదయం 8 గంటలకు మనోన్మాన ప్రమాణ శాంతి హోమం, కుంభస్థాపన, పంచాగ్ని ప్రణయనం, శాత్తుమొర, సాయంత్రం 6.30 గంటలకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.

ఆగస్టు 25న ఉదయం 7.30 గంటలకు చతుస్థానార్చన, ఏకశీతి కలశ స్నపనం, మూర్తి హోమం, అష్టబంధనం, సాయంత్రం 6 గంటలకు శయ్యాధివాసం, తత్వ హోమాలు, శాంతి హోమం, శాత్తుమొర నిర్వహించనున్నారు.

ఆగస్టు 26న ఉదయం 7 గంటలకు చతుస్థానార్చన, మూర్తి హోమం, ప్రాయశ్చిత్త హోమం నిర్వహించి, ఉదయం 9.45 నుంచి 11.30 గంటల వరకు శ్రవణా నక్షత్రం, తులా లగ్నంలో మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ, కళాకర్షణ కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించనున్నారు.

మహాసంప్రోక్షణ అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి ఎ. ప్రశాంతి, ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఈశ్వర్ రెడ్డి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

Pavitrotsavams Commences






The annual Pavitrotsavams commenced on a grand religious note in Tirumala on Sunday.

As a part of the three day fete, on the first day, Snapana Tirumanjanam was performed to the processional deities of Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi.

In the Kalyanotsava Mandapam, the Utsava deities were offered celestial baths with sacred and aromatic ingredients amidst the chanting of vedic hymns by the Veda Pundits in a befitting manner.

On the first day, Pavitra Pratista is carried out by the priests as per Vaikhanasa Agama.

Both the Tirumala Pontiffs, TTD EO Sri Muddada Ravi Chandra, Additional EO Sri Ch.Venkaiah Chowdary, TTD Board member Sri Nannapaneni Sada siva rao, Temple DyEO Sri Lokanatham, and other staff, devotees were also present.

టీటీడీకి రూ.17 లక్షలు విరాళం donation




పల్నాడు జిల్లా రెంటపాళ్ల గ్రామానికి చెందిన శ్రీ వినోద్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు ఆదివారం రూ.17 లక్షలు విరాళంగా అందించారు.

ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు విరాళం డీడీ అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు.

23.8.26

₹10 Lakhs Donation to TTD




A devotee from Hyderabad, Sri Bandi Satya Narayana, donated Rs.10 lakh to the TTD Sri Venkateswara Annaprasadam Trust on Saturday.


The donor handed over the donation cheque to TTD Chairman Sri B.R. Naidu.