Featured Post

ఆగ‌స్టు నెలలో శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు padmavati ammavari temple

తిరుచానూరు శ్ రీపద్మావతీ అమ్మవారి ఆలయం మ‌రి యు అనుబంధ ఆల‌యాల‌లో ఆగ‌స్టు నె లలో పలు విశేష ఉత్సవాలు జరుగను న్నాయి . వాటి వివరాలు...

2.8.26

ఆగ‌స్టు నెలలో శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు padmavati ammavari temple




తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం మ‌రియు అనుబంధ ఆల‌యాల‌లో ఆగ‌స్టు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో....

-  ఆగ‌ష్ఠు 7, 14, 28వ‌ తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చిపై అమ్మ‌వారు ఆల‌య నాలుగు మాడ వీధులలో విహ‌రించి భక్తులకు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు.  

•  ఆగ‌ష్ఠు 25న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా శ్రీపద్మావతి అమ్మవారు సాయంత్రం 6.45 గంట‌ల‌కు గజ వాహనంపై భక్తులను కటాక్షిస్తారు.

-    ఆగ‌ష్ఠు 21న వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాయంత్రం 6 గంట‌ల‌కు శ్రీపద్మావతి అమ్మవారి స్వర్ణరథోత్సవం జరుగుతుంది.

శ్రీ బలరామ కృష్ణ స్వామి వారి లయంలో ...

-  ఆగ‌ష్ఠు 8న రోహిణి న‌క్ష‌త్రం సంద‌ర్బంగా శ్రీ కృష్ణ స్వామివారికి సాయంత్రం 6 గంట‌లకు తిరుచ్చి ఉత్సవం జ‌రుగ‌నుంది.

శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో...

-    ఆగ‌ష్ఠు 3, 30వ తేదీల‌ల్లో న ఉత్తర భద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంట‌లకు స్వామివారు తిరుచ్చిపై ఆల‌య నాలుగు మాడ వీధులలో విహరించి అనుగ్ర‌హించ‌నున్నారు. 

శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో...

-   ఆగ‌ష్ఠు 17న హస్త నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు స్వామివారు తిరుచ్చిపై భక్తులను క‌టాక్షించ‌నున్నారు.

తిరుచానూరు శ్రీనివాస ఆలయం...

ఆగష్ఠు 1, 8, 15, 22, 29వ‌ తేదీలలో వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి మూలవర్లకు అభిషేకం.

అప్ప‌లాయ‌గుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో....

-   ఆగ‌ష్ఠు 4న తేదీ ఉద‌యం 8 గంట‌ల‌కు అష్టదళ పాదపద్మారాధన సేవ.

-   ఆగ‌ష్ఠు 7, 14, 21, 28వ తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రలంకారణ సేవ, అభిషేకం.

-   ఆగ‌ష్ఠు 12న ఉదయం 8 గంటలకు అష్టోత్తరశత కలశాభిషేకం.

-   ఆగ‌ష్ఠు 26న శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి క‌ల్యాణోత్స‌వం.

-   ఆగ‌ష్ఠు 2, 9, 16, 23, 30వ‌ తేదీలలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి ఉదయం 8.15 గంట‌లకు అభిషేకం.

1.8.26

Traditional Brinjal Curry with Incredible Flavor | ఈ వంకాయ కూర... రుచి అద్భుతం https://youtu.be/_oh08P6LnP0


Traditional Brinjal Curry with Incredible Flavor | ఈ వంకాయ కూర... రుచి అద్భుతం

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుపతిలో పకడ్బందీ ఏర్పాట్లు arrangements



తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, నవరాత్


రి బ్రహ్మోత్సవాలు, పెరటాసి శనివారాల సందర్భంగా తిరుమల, తిరుపతికి అధిక సంఖ్యలో విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా న్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈవో డాక్టర్ . శరత్ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని జేఈవో కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.

భక్తుల వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి నగరం, పరిసర ప్రాంతాల్లో తగిన పార్కింగ్ స్థలాలు సిద్ధం చేయాలని, వివిధ ప్రాంతాల్లో హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రించాలని సూచించారు. పార్కింగ్, హోల్డింగ్ పాయింట్ల వద్ద తగిన సంఖ్యలో మొబైల్ మరుగుదొడ్లు, స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యాలు కల్పించి పరిశుభ్రతను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.

తిరుపతి నగరం, పరిసర ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్లు, రహదారులు, భక్తులు అధికంగా సంచరించే ప్రాంతాల్లో స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ముఖ్య ప్రాంతాల్లో క్యూ ఆర్ కోడ్‌లతో కూడిన సూచిక బోర్డులు ఏర్పాటు చేసి భక్తులకు అవసరమైన సమాచారం సులభంగా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.

స్థానిక ఆలయాలు, ప్రధాన భవనాలు, ప్రధాన రహదారులను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

టీటీడీ ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, అలిపిరి బస్టాండ్, అలిపిరి నడక మార్గం, విష్ణునివాసం, శ్రీనివాసం తదితర ప్రాంతాల్లో అదనపు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

 మహతి కళాక్షేత్రం, రామచంద్ర పుష్కరిణి, అన్నమాచార్య ప్రాజెక్టులో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపారు. 

భక్తులకు అవసరమైన ప్రాంతాల్లో శ్రీవారి సేవకులను నియమించి సేవలను మరింత విస్తృతంగా అందించాలని టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ టి. రవిని ఆదేశించారు.

శ్రీవారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలు, పెరటాసి శనివారాల్లో అధిక భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇంజినీరింగ్ శాఖతో పాటు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి భక్తులకు అత్యుత్తమ సేవలు అందించాలని జేఈవో సూచించారు.

ఈ సమావేశంలో ఎస్‌ఈ–1 శ్రీ మనోహరం, ఎస్‌ఈ (ఎలక్ట్రికల్) శ్రీ వెంకటేశ్వర్లు, డీఈలు శ్రీ రవిశంకర్ రెడ్డి, శ్రీమతి సరస్వతి, విజిలెన్స్ అధికారి శ్రీ గిరిధర్, అదనపు ఆరోగ్య అధికారి డాక్టర్ సునీల్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Serving Srivari Devotees is A Blessing Earned Throuth Past Good Deeds- TTD EO






TTD Executive Officer Sri Muddada Ravichandra said that getting an opportunity to serve devotees in the sacred presence of Lord Venkateswara is a blessing earned through past good deeds.

A total of 160 retired employees, including 28 who retired on Friday and 132 who retired between January 1 and May 31 this year, were felicitated at a grand function held at Mahathi Kalakshetram in Tirupati.

Addressing the gathering, the EO appreciated the retired employees for their dedicated service to TTD and urged them to share their rich experience and knowledge with future generations of employees. He wished them a healthy, happy and peaceful retired life under the blessings of Lord Venkateswara and said that TTD would continue this annual felicitation programme.

Earlier, TTD JEO Dr. A. Sharath said that serving Srivari is a rare privilege and honouring retired employees would inspire future generations.

The EO and JEOs honoured the retirees with shawls and mementoes. They were also presented with Srivari Laddu Prasadam, Vada, jacket cloth, Theertham and Maha Prasadam, followed by Vedic blessings from priests.

Deputy EO (HR) Sri Govindarajan, Welfare Deputy EO Sri Anandaraju, other officials, employee union representatives, retired employees and their family members attended the programme.