Featured Post

UTLOTSAVAM HELD GRANDLY AT SRI KRISHNA SWAMY TEMPLE IN TIRUCHANOOR

The Utlotsavam, celebrating the playful childhood leelas of Lord Sri Krishna, was held with devotion and grandeur at the Sri Krishna Swamy T...

6.9.26

UTLOTSAVAM HELD GRANDLY AT SRI KRISHNA SWAMY TEMPLE IN TIRUCHANOOR



The Utlotsavam, celebrating the playful childhood leelas of Lord Sri Krishna, was held with devotion and grandeur at the Sri Krishna Swamy Temple in Tiruchanoor on Saturday as part of the Sri Krishna Janmashtami celebrations.


The temple, attached to the Sri Padmavathi Ammavari Temple, observed special religious rituals throughout the day. The Lord was awakened with Suprabhata Seva in the morning, followed by Sahasranamarchana and Abhishekam to the Moolavarlu.


From 3 pm to 4 pm, Snapana Tirumanjanam was performed to the processional deities, followed by Oonjal Seva. From 6 pm to 7.30 pm, Utlotsavam and Asthanam were conducted in a grand manner.


Devotees participated in large numbers and witnessed the celebrations with devotion, seeking the blessings of Lord Sri Krishna.


Temple AEO Sri Devarajulu, Temple Inspector Sri Chalapathi, archakas, staff and a large number of devotees participated in the celebrations.

తిరుచానూరు శ్రీకృష్ణస్వామి ఆలయంలో వైభవంగా ఉట్లోత్సవం tiruchanoor



తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆల అనుబంధ ఆలయమైన శ్రీకృష్ణస్వామివారి ఆలయంలో శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకల్లో భాగంగా శనివారం ట్లోత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.

శ్రీకృష్ణ పరమాత్మను స్మరిస్తూ ఆలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన చేపట్టారు. అనంతరం మూలవర్లకు అభిషేకం నిర్వహించారు.

మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శ్రీకృష్ణస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించి, అనంతరం ఊంజల్‌సేవ చేపట్టారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఉట్లోత్సవం, ఆస్థానం వేడుకలను వైభవంగా నిర్వహించారు.

శ్రీకృష్ణుని బాలలీలలను స్మరింపజేసే ఉట్లోత్సవాన్ని భక్తులు భక్తిప్రపత్తులతో వీక్షించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ దేవరాజులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ చలపతి, ఆలయ అర్చకులు, సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

UTLOTSAVAM OBSERVED WITH DEVOTION AT TIRUMALA







As part of the Sri Krishna Janmashtami celebrations, the traditional Utlotsavam was held with great religious fervour at Tirumala on Saturday evening. 


By custom, it is conducted on the day following Gokulashtami in Tirumala.


Sri Malayappa Swamy along with and Sri Krishna Swamy were taken in a grand procession on golden Tiruchis separately through the temple streets. 


The procession first reached Sri Pedda Jeeyar Mutt, where Asthanam was held, and the Utlotsavam was later conducted in front of the main temple amid much enthusiasm, drawing a large number of local residents and pilgrims.


HH Sri Sri Sri Pedda Jeeyar Swamy, HH Sri Sri Sri Chinna Jeeyar Swamy of Tirumala, Additional EO Sri Ch. Venkaiah Chowdary, Temple Deputy EO Incharge Sri Bhaskar and others were present.

శ్రీ‌ కృష్ణ‌జ‌న్మాష్ట‌మి వేడుక‌ల్లో భాగంగా తిరుమలలో శనివారం ఉట్లోత్సవం అత్యంత వేడుక‌గా జరిగింది. utlotsavam








శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించిన మరునాడు ఉట్లోత్సవాన్ని (శిక్యోత్సవం) నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఇందులోభాగంగా శ్రీమలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామి మరో తిరుచ్చిపై తిరువీధులలో ఊరేగుతూ ప‌లు ప్రాంతాల్లో ఉట్లోత్సవాన్ని తిలకించారు.

ముందుగా శ్రీమలయప్పస్వామివారు, శ్రీకృష్ణస్వామివారి ఉత్సవమూర్తుల‌ను ఊరేగింపుగా శ్రీ పెద్దజీయర్‌ మఠానికి వేంచేపు చేశారు. అక్కడ ఆస్థానం చేపట్టారు. ఆ తరువాత శ్రీ‌వారి ఆల‌యం ఎదుట ఉట్లోత్స‌వం ఉత్సాహంగా జ‌రిగింది.

సాయంత్రం నుండి రాత్రి వరకు ఆద్యంతం కోలాహలంగా పలు ప్రాంతాల్లో సాగిన ఈ ఉట్లోత్సవంలో స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయర్ స్వామి, తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, అదనపు ఈవో శ్రీ సి.హెచ్ వెంకయ్య చౌదరి, శ్రీవారి ఆలయ ఇన్ ఛార్జ్ డిప్యూటీ ఈవో శ్రీ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

DEVOTEE SAFETY IS THE TOP PRIORITY ELABORATE SECURITY ARRANGEMENTS FOR SRIVARI BRAHMOTSAVAMS – TTD CVSO



TTD is making elaborate security arrangements so that devotees attending the upcoming Srivari Brahmotsavams can have a safe, hassle-free darshan and comfortably witness the Vahana Sevas, said TTD CVSO Sri Murali Krishna.


He held a review meeting on Saturday at Annamayya Bhavan in Tirumala along with the Tirupati District SP Sri Subbarayudu and officials on security arrangements in the four Mada Streets and other key areas of Tirumala. 


Drawing on past experience during Brahmotsavams, comprehensive measures are being planned jointly by TTD Vigilance and the Police Department.


Special security and barricading are being arranged for the Hon'ble Chief Minister's visit on the first day on Dhwajarohanam.


Queue lines and entry-exit points strengthened as per the expected rush.


For Garuda Seva, parking areas in Tirumala and Tirupati are being inspected in advance and a special traffic plan prepared to prevent congestion. 


Multilingual signboards and direction boards will be installed at important junctions in both towns.


SP Sri Subbarayudu said the plan gives special focus to devotee safety, crime prevention and traffic regulation, with coordinated measures by TTD Vigilance, Police, Fire, Forest, Intelligence, APSRTC and Railways.


Additional SPs Sri Ramakrishna, Sri Ravimanoharachari, TTD Vigilance and Security Officer Sri Surendra, and officials of the Fire, Forest, Intelligence, APSRTC and Railways departments took part.

భక్తుల భద్రతే లక్ష్యం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు – టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ devotees safety




శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకుని, వాహన సేవలను ఆనందంగా తిలకించేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ తెలిపారు

తిరుమల నాలుగు మాడ వీధులతోపాటు ఇతర ప్రాంతాల్లో చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై శనివారం సీవీఎస్వో, తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు.

సందర్భంగా సీవీఎస్వో మాట్లాడుతూ, గత బ్రహ్మోత్సవాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి టీటీడీ విజిలెన్స్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పకడ్బందీ భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాహన సేవలను తిలకించేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

ధ్వజారోహణానికి ప్రత్యేక బందోబస్తు

శ్రీవారి బ్రహ్మోత్సవాల ధ్వజారోహణం రోజున గౌరవ ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు, బ్యారికేడింగ్ తదితర ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో భద్రతా చర్యలు చేపడుతున్నామన్నారు.

గరుడసేవకు ప్రత్యేక ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లు

గరుడసేవకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున తిరుమల, తిరుపతిలోని పార్కింగ్ ప్రాంతాలను ముందుగానే పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సీవీఎస్వో తెలిపారు. అధిక సంఖ్యలో వాహనాలు వచ్చే నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు.


భక్తులకు సులభంగా మార్గనిర్దేశం చేసేందుకు తిరుమల, తిరుపతిలోని ముఖ్య కూడళ్లలో వివిధ భాషల్లో సైన్‌బోర్డులు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ప్రణాళికాబద్ధంగా పటిష్ట బందోబస్తుఎస్పీ శ్రీ సుబ్బరాయుడు

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళికాబద్ధంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు తెలిపారు. భక్తుల భద్రతతోపాటు క్రైమ్, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.

టీటీడీ విజిలెన్స్, పోలీస్, ఫైర్, ఫారెస్టు, ఇంటెలిజెన్స్, ఆర్టీసీ, రైల్వే తదితర శాఖల సమన్వయంతో బ్రహ్మోత్సవాల సమయంలో భద్రత, ట్రాఫిక్ నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

సమావేశంలో అదనపు ఎస్పీలు శ్రీ రామకృష్ణ, శ్రీ రవిమనోహరాచారి, టీటీడీ విజీవో శ్రీ సురేంద్ర, ఫైర్, ఫారెస్టు, ఇంటెలిజెన్స్, ఆర్టీసీ, రైల్వే తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.