Featured Post

Pallavotsavam Held in Tirumala

The traditional Pallavotsavam was observed in a religious manner in Tirumala on Wednesday.  In connection with the birth anniversary celebra...

23.7.26

Pallavotsavam Held in Tirumala






The traditional Pallavotsavam was observed in a religious manner in Tirumala on Wednesday. 

In connection with the birth anniversary celebrations of the Maharaja of Mysore, TTD observes the traditional  Pallavotsavam.

Following the Sahasra Deepalankara Seva, Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi were taken in a procession to the Karnataka Choultry, where the representatives of the Mysore royal family offered traditional rituals to the deities.

Subsequently, officials from the Karnataka State Government and representatives of the Mysore royal family extended a formal welcome and performed a special Harathi to the deities. 

Special pujas were conducted, naivedyam was presented, and prasadam was distributed to devotees.

TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary, Board Members Sri NareshKumar and Sri Darshan, Temple Peishkar Sri Ramakrishna, and other officials participated in the event.

తిరుమలలో ఘనంగా పల్లవోత్సవం pallavotsavam







తిరుమలలో బుధవారంనాడు పల్లవోత్సవం ఘనంగా జరిగింది. మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని టీటీడీ పల్లవోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సహస్రదీపాలంకారసేవ నంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేసి మైసూర్‌ సంస్థానం వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు.

అనంతరం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు శ్రీ నరేష్, శ్రీ దర్శన్, పేష్కార్ శ్రీ రామ కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Sri Soumyanatha Swamy Vari Brahmotsavams Begin with Dwajarohanam at Nandalur





The annual Brahmotsavams of Sri Soumyanatha Swamy Temple at Nandalur commenced grandly on Wednesday morning with the traditional Dhwajarohanam. The Garuda flag was ceremonially hoisted on the temple flagstaff amid Vedic chanting, mangala vadyams and Govinda namasmarana by devotees. Later, Asthanam was held in the temple.

Earlier, the processional deities of Sri Soumyanatha Swamy with Sridevi and Bhudevi, along with the Dhwaja Patam, Chakrathalwar and Parivara Deities, were taken in a procession on the golden Tiruchi around the four Mada streets.

Temple Deputy EO Smt. A. Prasanthi, AEO Sri Ravi, Superintendent Sri Hanumanthaiah, Temple Inspector Sri Dileep, priests, officials, Srivari Sevaks and a large number of devotees participated.

Vahana Sevas will be held every day at 8 a.m. and 7 p.m. till July 30, while Pushpayagam will take place on July 31 at 6 p.m.

The Arjitha Kalyanotsavam will be conducted on July 28 at 10 a.m. Couples can participate by purchasing a ticket priced at Rs.500.

During the Brahmotsavams, TTD's Hindu Dharma Prachara Parishad, Annamacharya Project and Dasa Sahitya Project will organise daily devotional music, Harikatha, spiritual discourses and cultural programmes for devotees.

ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామివారి బ్రహ్మోత్సవాలు brahmotsavams





నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ఉదయం ధ్వజారోహణ మహోత్సవంతో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ మధ్య ఉదయం 7.45 నుంచి 8.15 గంటల వరకు గరుడ చిహ్నంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించి ఉత్సవాలకు శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టారు.

అనంతరం స్వామివారి ఆస్థానం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు.

అంతకుముందు ఉదయం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథస్వామివారు, ధ్వజపటం, చక్రత్తాళ్వార్‌, పరివారదేవతలతో కలిసి బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడవీధుల్లో దివ్యంగా విహరించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు స్వయంగా పర్యవేక్షిస్తారనే విశ్వాసంతో ఈ ఊరేగింపును నిర్వహించడం ఆనవాయితీ.

ధ్వజారోహణం ద్వారా అష్టాదశ గణాలు, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించినట్లు ఆగమశాస్త్రాలు పేర్కొంటాయి.

ఈ కార్యక్రమంలో  ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి ఎ. ప్రశాంతి, ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ దిలీప్, అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ప్రతిరోజూ వాహనసేవలు

బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు శ్రీ సౌమ్యనాథస్వామివారు వివిధ దివ్య వాహనాలపై నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

వాహనసేవల వివరాలు

జూలై 22: ధ్వజారోహణం – రాత్రి యాలి వాహనం

జూలై 23: ఉదయం పల్లకీ సేవ – రాత్రి హంస వాహనం

జూలై 24: ఉదయం పల్లకీ సేవ – రాత్రి సింహ వాహనం

జూలై 25: ఉదయం కల్పవృక్ష వాహనం – రాత్రి హనుమంత వాహనం

జూలై 26: ఉదయం శేష వాహనం – రాత్రి గరుడ వాహనం

జూలై 27: ఉదయం సూర్యప్రభ వాహనం – రాత్రి చంద్రప్రభ వాహనం

జూలై 28: ఉదయం 10 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం – రాత్రి గజ వాహనం

జూలై 29: ఉదయం 9 గంటలకు రథోత్సవం – రాత్రి అశ్వ వాహనం

జూలై 30: ఉదయం చక్రస్నానం – రాత్రి ధ్వజావరోహణం

జూలై 31: సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం

జూలై 28న ఆర్జిత కల్యాణోత్సవం

జూలై 28వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహించే ఆర్జిత కల్యాణోత్సవంలో గృహస్థ దంపతులు రూ.500 టికెట్‌తో పాల్గొనవచ్చు. పాల్గొనే దంపతులకు టీటీడీ తరఫున ఒక ఉత్తరీయం, ఒక రవికెతో పాటు అన్నప్రసాదాలు అందజేయనున్నారు.

ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తులకు ఆధ్యాత్మికానందం

బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీతం, హరికథ, ఆధ్యాత్మిక ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి.

SRI SOUMYANATHA SWAMY BLESSES DEVOTEES ON YALI VAHANAM


As part of the annual Brahmotsavams of Sri Soumyanatha Swamy Temple at Nandalur, the Lord gave darshan to devotees on the Yali Vahanam on Wednesday evening.

The procession was held in a spiritually vibrant atmosphere with devotional bhajans, Kolatam performances, and traditional musical ensembles. Devotees offered Harathi at various points and received the divine blessings of the Lord.

Temple Deputy EO Smt. A. Prasanthi, AEO Sri Ravi, Superintendent Sri Hanumanthaiah, Temple Inspector Sri Dileep, priests, officials, and a large number of devotees participated in the Vahana Seva.

Tulasi Mahatyam Utsavam at Sri Govindaraja Swamy Vari Temple on 26th July




Sri Govindaraja Swamy to Bless Devotees on Garuda Vahanam Tulasi Mahatyam Purana Recital to Mark the Occasion. 

TTD will conduct the sacred Tulasi Mahatyam Utsavam at Sri Govindaraja Swamy Temple, Tirupati, on July 26 with religious fervour.

The festival is observed on Sravana Sukla Dwadasi to commemorate the appearance of Tulasi Devi, who is considered most dear to Lord Srimannarayana.

On the occasion, Sri Govindaraja Swamy will bless devotees on Garuda Vahanam from 4.30 a.m. to 6.30 a.m., taking a procession through the four Mada Streets.

Later, Asthanam will be held from 6.30 a.m. to 7.30 a.m., during which temple priests will recite the Tulasi Mahatyam Purana and explain the significance of Tulasi Devi.

 Theertha Prasadam will be distributed to devotees afterwards.

TTD has invited devotees to participate in the sacred festival and receive the blessings of Sri Govindaraja Swamy.

జూలై 26న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా తులసి మహత్యం ఉత్సవం tulasi mahatyam utsavam




తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 26 తేదీన పవిత్రమైన తులసి మహత్యం ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.

శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతిపాత్రమైన తులసీదేవి ఆవిర్భావాన్ని స్మరించుకుంటూ శ్రావణ శుద్ధ ద్వాదశి సందర్భంగా ఈ ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా తెల్లవారుజామున 4.30 గంటల నుంచి 6.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు గరుడవాహనాన్ని అధిరోహించి ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనభాగ్యం కల్పించనున్నారు.

గరుడవాహన సేవలో స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించడం ద్వారా భక్తులకు విశేష పుణ్యఫలాలు లభిస్తాయని ఆగమాలు పేర్కొంటున్నాయి.

అనంతరం ఉదయం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు స్వామివారి ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అర్చకులు తులసి మహత్యం గురించి పురాణ పఠనం చేసి తులసీదేవి వైభవాన్ని భక్తులకు వివరిస్తారు.

 అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేస్తారు.

ఈ దివ్య ఉత్సవంలో పాల్గొని శ్రీ గోవిందరాజస్వామివారి అనుగ్రహం పొందాలని టీటీడీ భక్తులను ఆహ్వానిస్తోంది.