తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. 32 మంది వేద, శ్రౌత, స్మార్త పండితులు యాగ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కార్యక్రమాల వివరాలు:
ఆగస్టు 30న సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో అంకురార్పణ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, ఋత్విక్ వరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 3వ తేది వరకు ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో వరుణయాగం, కారీరిష్టి, పర్జన్యశాంతి కార్యక్రమాలతో పాటు ఏడు వేదశాఖల పారాయణం, రామాయణం, సుందరకాండ, విరాటపర్వం, ఋష్యశృంగ ధ్యాన పారాయణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
గోగర్భం డ్యామ్ వద్ద వరుణ, పర్జన్య మంత్ర అనుష్ఠానం నిర్వహిస్తారు.
సాయంత్రం 6గం.నుండి రా. 8.గం వరకు ధర్మగిరిలో అగ్నిహోత్ర అనుష్ఠానం, ఏడు వేదశాఖల పారాయణం జరుగుతుంది.
సెప్టెంబర్ 3న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
Seeking the divine intervention to shower good amount of rainfalls and for the well-being of humanity, a series of Vedic rituals including Varuna Yajna, Parjanya Shanti and Kareeri Iṣṭi Yajnas—will be performed from August 30 to September 03 at Dharmagiri Veda Vignana Peetham in Tirumala for five days.
Programme Schedule as follows :
30 August :
Ankurarpanam:6:30pm
Followed by
7pm–8pm
Ganapati Puja, Punyahavachana and Ritvik Varana ceremony.
31 August to 03 September
9:30 AM–12:30 PM :
Varuna Yajna, Kareeri Iṣṭi, Parjanya Shanti Homams takes place with the recitations from the Vedas, Ramayana Sundarakanda, Virataparva, and Rishyashrunga Dhyana and Parayana sessions at Dharmagiri Veda Vijnana Peetham.
6pm–8pm:
Agnihotra Anushthaanam and Veda Parayanam from Seven Sakhas at Dharmagiri.
On the other hand, during the same time, Varuna and Parjanya Mantra Anushthaanam will also be recited at the Gogarbham Dam.
On September 03, the Rituals conclude with Purnahuti at Dharmagiri between 11am and 12noon.
సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు శ్రీ విఖనసాచార్యుల సన్నిధికి వేంచేపు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఆస్థానం నిర్వహించి నివేదన చేపట్టారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పారు పత్తేదార్ శ్రీ బాల సుబ్రహ్మణ్యం, శ్రీ విఖనస ట్రస్టు కార్యదర్శి శ్రీ గంజాం ప్రభాకరాచార్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.