Featured Post

ITS A DAY OF DRY FRUITS AT SNAPANAM

The Snapana Tirumanjanam to the Utsava deities of Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi was held at Ranganayakula Mandapam on W...

17.9.26

ITS A DAY OF DRY FRUITS AT SNAPANAM







The Snapana Tirumanjanam to the Utsava deities of Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi was held at Ranganayakula Mandapam on Wednesday.


As a part of this ritual, the deities were decked with different varieties of dry fruits including cardamom, pista, badam, Vettiver etc. during Snapana Tirumanjanam.


The entire premises was decorated with colourful fruits and flowers.


Both the Tirumala Pontiffs, EO Sri M Ravichandra and others were present.

ఏలకలు, వట్టివేరు, ఎండు ద్రాక్ష, బాదం–పిస్తా మాలలతో వేడుకగా స్నపన తిరుమంజనం snapana tirumanjanam






శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి ఏలకలు, వట్టివేరు, ఎండు ద్రాక్ష, బాదంపిస్తా తదితర సుగంధ ద్రవ్యాలతో రూపొందించిన విశేష మాలల మధ్య బుధవారం స్నపన తిరుమంజనం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది.

తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు అర్చకస్వాములు వేద మంత్రోచ్ఛారణల నడుమ వైఖానస ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఆశీనులను చేసి, రంగురంగుల పుష్పాలతో సుందరంగా అలంకరించారు.

ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పాలు, పెరుగు, కొబ్బరినీళ్లు, తేనె, పసుపు, గంధంతో విశేష అభిషేకం చేశారు. శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో శాస్త్రోక్తంగా స్నపనం నిర్వహించారు.

స్నపన తిరుమంజనం సందర్భంగా ఉపనిషత్ మంత్రాలు, దశశాంతి మంత్రాలు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం తదితర పంచసూక్తాలను టీటీడీ వేద పారాయణదారులు భక్తిభావంతో పారాయణం చేశారు. 

అభిషేకానంతరం తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్లు వివిధ దివ్య పాశురాలను పఠించారు.

ఈ వేడుకలో భాగంగా ఏలకలు, వట్టివేరు, ఎండు ద్రాక్ష, నీలిరంగు పవిత్ర మాలలు, బాదం–పిస్తా మాలలు, పసుపు కొమ్ముల మాలలు, నందివర్ధనం–తామర మాలలు, రోజ్‌ పెటల్స్‌తో స్వామి, అమ్మవార్లను విశేషంగా అలంకరించారు.

సుగంధ పరిమళాలు, వేదఘోషలు, భక్తి భావంతో రంగనాయకుల మండపం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, బోర్డు సభ్యురాలు శ్రీమతి సుచిత్ర ఎల్లా, ఇతర అధికారులు పాల్గొన్నారు.

GUJARATI GARBHA, UTTARAKHAND CHOLIA, PUNJABI BHANGRA STEAL THE SHOW








The devotees rejoiced in the art forms of Bangra, Cholia and Garbha in Tirumala on Wednesday evening in front of Hamsa Vahanam.


Drums, Lambadi dance, Karrasamu, Kolatam are a few other artforms that enthralled the devotees.


A total of 504 artistes belonging to 19 teams from 08 states performed various dance forms 

హంస వాహనంపై శ్రీవారికి కళాకారుల నృత్య నీరాజనం nrutyaneerajanam







తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం రాత్రి హంస వాహనసేవ భక్తి వైభవంతో, సాంస్కృతిక శోభతో ఘనంగా జరిగింది. హంస వాహనంపై సరస్వతి అలంకారంలో కొలువైన శ్రీ మలయప్పస్వామివారు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్యదర్శనం ప్రసాదించారు.

శ్రీవారి హంస వాహనసేవలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు 8 రాష్ట్రాలకు చెందిన 19 కళా బృందాల నుంచి 504 మంది కళాకారులు పాల్గొని విభిన్న జానపద, సాంస్కృతిక కళారూపాలను ప్రదర్శిస్తూ భక్తులను అలరించారు.

నారాయణ దివ్యప్రబంధ గానంతో ఆధ్యాత్మిక శోభ

శ్రీవారి వాహనానికి ముందుగా జీయర్‌స్వాములు నారాయణ దివ్యప్రబంధాన్ని గానం చేస్తూ ముందుకు సాగారు. వందలాది మంది శ్రీవైష్ణవులు వారిని అనుసరించారు. అశ్వ, వృషభ, గజరాజుల విన్యాసాలు తిరుమాడ వీధుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఆకట్టుకున్న జార్ఖండ్‌ చౌ నృత్యం

జార్ఖండ్‌కు చెందిన శ్రేష్ఠిధర్ మహతో బృందం ప్రదర్శించిన చౌ నృత్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ముసుగులు ధరించి శరీర కదలికలు, ప్రత్యేక అడుగులు, యుద్ధ విన్యాసాలతో ప్రదర్శించే ఈ కళారూపంలో రామాయణం, మహాభారతం, పురాణ గాథలను అభినయిస్తారు.

ఎగరడం, గిర్రున తిరగడం, యుద్ధ విన్యాసాలు చేయడం చౌ నృత్యంలోని ప్రత్యేకతలు. జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వివిధ శైలుల్లో ప్రదర్శించే చౌ నృత్యం నృత్యం, నాటకం, యుద్ధకళల సమ్మేళనంగా ప్రసిద్ధి చెందింది.

గర్బాతో గుజరాతీ సంప్రదాయాల సందడి

గుజరాత్‌కు చెందిన గర్బా నృత్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సంప్రదాయబద్ధంగా దీపంతో కూడిన మట్టి కుండ చుట్టూ స్త్రీ, పురుషులు కలిసి చేసే ఈ నృత్యం ఉత్సాహభరితంగా సాగింది.

యుద్ధ విన్యాసాలతో చోలియా నృత్యం

ఉత్తరాఖండ్‌కు చెందిన చోలియా నృత్యం కళాకారుల యుద్ధ విన్యాసాలతో ఆకట్టుకుంది.

పంజాబ్‌కు చెందిన కళాకారుల భాంగ్రా నృత్యం ఉత్సాహభరితమైన అడుగులతో తిరుమాడ వీధుల్లో సందడి చేసింది. పంటల పండుగలతో అనుబంధం ఉన్న భాంగ్రా నృత్యం భక్తుల్లో ఉత్సాహాన్ని నింపింది.

దేశం నలుమూలల జానపద కళల సమ్మేళనం

వీటితోపాటు కర్రసాము, కోలాటం, డ్రమ్స్, లంబాడీ నృత్యం, యోగచాప్ తదితర కళారూపాలను కళాకారులు ప్రదర్శించారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో దేశంలోని విభిన్న ప్రాంతాల జానపద కళలకు వేదిక కల్పించడం ద్వారా “ఏకం సత్‌ – విభిన్న కళా సంప్రదాయాలు” అనే భారతీయ సాంస్కృతిక వైవిధ్యం భక్తులకు కనువిందు చేసింది. భక్తి, కళ, సంప్రదాయం మేళవింపుతో హంస వాహనసేవ తిరుమాడ వీధుల్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభను నింపింది.

HAMSA VAHANA SEVA OBSERVED







The second evening witnessed Sri Malayappa decked as Saraswathi Devi holding Veena in His hands on the elegant and divine Swan carrier.


Often considered as Paramahamsa Swaroopa, the Hamsa has got the capacity to separate water from milk which signifies distinguishing  good from bad.


Both the Pontiffs of Tirumala, TTD Chairman Sri BR Naidu, EO Sri M Ravichandra, Additional EO Sri Ch Venkaiah Chowdary and others were present.

హంస వాహనంపై సరస్వతి అమ్మవారి అలంకారంలో శ్రీ మలయప్ప hamsa vahanam





తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన బుధవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు రస్వతి అమ్మవారి అలంకారంలో, వీణను ధరించి హంస వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. జ్ఞానానికి ప్రతీకగా భావించే హంస వాహనంపై శ్రీవారి అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

వాహనసేవ సందర్భంగా తిరుమాడ వీధులు భక్తజన సందోహంతో కిక్కిరిశాయి. మంగళవాయిద్యాల నడుమ, వేదఘోషలు, భక్తుల గోవింద నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాబృందాలు ప్రదర్శించిన సంప్రదాయ కళారూపాలు వాహనసేవకు మరింత శోభను చేకూర్చి భక్తులను విశేషంగా అలరించాయి.

జ్ఞానానికి ప్రతీక హంస వాహనం

హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు జ్ఞానస్వరూపుడిగా ప్రకాశిస్తారని పురాణాలు, ఐతిహ్యాలు తెలియజేస్తున్నాయి. హంస బ్రహ్మదేవుని వాహనం కాగా, అది జ్ఞానానికి ప్రతీకగా భావించబడుతుంది. పాలు–నీళ్లను వేరుచేసే హంస స్వభావం వివేకానికి, ఆత్మ–అనాత్మ విచక్షణకు సంకేతంగా పేర్కొనబడింది.

పరమాత్మ తత్వాన్ని గ్రహించి, ఆత్మజ్ఞానాన్ని పొందిన మహనీయులను ఉపనిషత్తులు “పరమహంసలు”గా అభివర్ణిస్తాయి. ఈ నేపథ్యంలో భక్తుల్లోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి, వివేకజ్ఞానాన్ని ప్రసాదించి, ఆధ్యాత్మిక ఉన్నతికి చేర్చే సంకల్పానికి హంస వాహనసేవ ప్రతీకగా నిలుస్తుంది. శ్రీవారి దివ్య దర్శనంతో భక్తుల హృదయాల్లో జ్ఞానజ్యోతి వెలిగి, ఆధ్యాత్మిక చైతన్యం వికసించాలని ఈ సేవ సందేశమిస్తుంది.

గోవింద నామస్మరణతో మార్మోగిన తిరుమలలో, హంస వాహనంపై జ్ఞానస్వరూపుడిగా వెలసిన శ్రీ మలయప్పస్వామివారి దివ్య దర్శనం భక్తులకు ఆధ్యాత్మికానందాన్ని పంచింది.

ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RENDER SERVICE TO DEVOTEES WITH RESPECT AND WARMTH - SEVAKS TOLD




TTD Chairman Sri B.R. Naidu urged Srivari Sevaks to serve devotees attending the Brahmotsavams with respect, courtesy, and warmth. 


Speaking at a spiritual meet with volunteers from various states at  Asthana Mandapam in Tirumala on Wednesday, he said that, as per the instructions of AP Chief Minister Sri Nara Chandrababu Naidu, steps will be taken to strengthen Srivari Seva.


He emphasized their key role in providing comfortable, cordial services to pilgrims.


TTD EO Sri Muddada Ravichandra said the Board has resolved to construct 5,000 temples and requested Sevaks to serve as their foundation. 


He added that structured efforts are underway to promote Hindu Dharma at each constituency, district, state, and national levels.


Additional EO Sri Ch. Venkaiah Chowdary noted that no other religious system in the world has such large-scale volunteer participation. 


TTD CVSO Sri Muralikrishna, TTD CPRDO Dr. T. Ravi, and other officials were present.