Featured Post

కార్వేటినగరంలో వైభవంగా ప్రారంభమైన శ్రీ వేణుగోపాలస్వామివారి తెప్పోత్సవాలు teppotsavams

కార్వేటినగరం రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి తెప్పోత్సవాలు మంగళవారం భక్తిశ్రద్ధలతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో...

26.8.26

కార్వేటినగరంలో వైభవంగా ప్రారంభమైన శ్రీ వేణుగోపాలస్వామివారి తెప్పోత్సవాలు teppotsavams


కార్వేటినగరం రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి తెప్పోత్సవాలు

మంగళవారం భక్తిశ్రద్ధలతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొనగా, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.


శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం


ఉదయం 9 నుంచి 10 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంతో అభిషేకం నిర్వహించి విశేషంగా అలంకరించారు.


వైభవంగా తిరువీధి ఉత్సవం


అనంతరం సాయంత్రం 5.30 గంటలకు స్వామివారి తిరువీధి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.


స్కంధ పుష్కరిణిలో కనులపండువగా తెప్పోత్సవం


రాత్రి 7.30 గంటలకు స్కంధ పుష్కరిణిలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.

పుష్కరిణిలో తెప్పలపై స్వామివారి విహారం

 భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.


ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ వీరస్వామి, ఆలయ అర్చకులు, సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఉత్తమోత్తమ కలశ స్నపనం kalasa snapanam




దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు భక్తిభావంతో, ఆగమశాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఉత్తమోత్తమ కలశ స్నపనం పవిత్ర వేదమంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా నిర్వహించారు.


ఈ సందర్భంగా 473 పవిత్ర కలశాల్లో ఆవాహన చేసిన తీర్థజలాలతో స్వామివారికి శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. ఆలయ పవిత్రత, దైవశక్తి మరింత వృద్ధి చెందాలని, సర్వలోకాలకు శ్రీనివాసుని అనుగ్రహం కలగాలని అర్చకులు భక్తిశ్రద్ధలతో ఈ విశిష్ట క్రతువును నిర్వహించారు.


అంతకుముందు చతుస్థానార్చన, మూర్తి హోమం, అష్టబంధనం తదితర కార్యక్రమాలను ఆగమశాస్త్ర విధానాలను అనుసరించి నిర్వహించారు. సాయంత్రం శయ్యాధివాసం, తత్వ హోమాలు, శాంతి హోమం, శాత్తుమొర కార్యక్రమాలను నిర్వహించనున్నారు.


ఆగస్టు 26న మహాసంప్రోక్షణ


ఆగస్టు 26న ఉదయం 7 గంటలకు చతుస్థానార్చన, మూర్తి హోమం, ప్రాయశ్చిత్త హోమం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 9.45 నుంచి 11.30 గంటల వరకు శ్రవణా నక్షత్రం, తులా లగ్నంలో మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ, కళాకర్షణ కార్యక్రమాలను ఆగమశాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.


మహాసంప్రోక్షణ కార్యక్రమాలు పూర్తయిన అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు.


ఈ కార్యక్రమాల్లో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఎ.  ప్రశాంతి, ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఈశ్వర్ రెడ్డి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

PAVITROTSAVAMS CONCLUDES






The annual three-day Pavitrotsavams at Tirumala Temple, concluded ceremoniously on Tuesday evening with Pavitra Poornahuti.


In the morning, Snapana Tirumanjanam, afternoon Visesha Samarpana were held, followed by a grand procession of the deities.


The main ritual of Poornahuti was performed at 7 PM in accordance with the Agama Shastra. 


Later, Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi circumambulated the temple and re-entered the sanctum, marking the conclusion of the festival.


Both the Pontiffs of Tirumala, Additional EO Sri Ch. Venkaiah Chowdary, Temple DyEO Sri Lokanatham, and other officials participated in the event.

పూర్ణాహుతితో తిరుమలలో ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాలు poornahuti







తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రావణమాసంలో ప్రతి ఏటా మూడురోజులపాటు నిర్వహించబడే పవిత్రోత్సవాలు మంగళవారంనాడు పవిత్ర పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి.


తొలి రెండురోజుల్లాగానే మంగళవారం ఉదయం కూడా యాగశాలలో ఋత్వికులు హోమాలను నిర్వహించారు. తరువాత ఉదయం 9 నుండి 11 గంటల నడుమ ఉత్సవమూర్తులకు వరుసగా గోక్షీరము, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపుతో అభిషేకించి చివరగా చందన పూతను పూశారు. ధూపదీప హారతులు నివేదించారు. దీనితో స్నపన తిరుమంజన కార్యక్రమం శాస్త్రోక్తంగా ముగిసింది.


కాగా మధ్యాహ్నం 1 గంటకు విశేష సమర్పణ, 4 గంటలకు ఉత్సవమూర్తుల ఊరేగింపు కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఇక రాత్రి 7 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీమలయ్పప్పస్వామివారు శ్రీదేవి, భూదేవిలతో కూడి విమాన ప్రదక్షిణంగా వెళ్ళి ఆలయ ప్రవేశం చేయడంతో పవిత్రోత్సవాలు పరిసమాప్తమయ్యాయి.


ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.


‘'CLEANING DAY'' FOR A HEALTHIER, HOTLIER TIRUMALA




With Tirumala poised to welcome tens of thousands of pilgrims for the sacred Srivari annual Brahmotsavams, the TTD Health Department has launched a proactive cleanliness campaign: every Tuesday, that will be observed as “Cleaning Day.”

Under the instructions of TTD Executive Officer Sri Muddada Ravichandra and Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary, the initiative seeks to ensure a spotless environment and hygienic food for all devotees.

Acting on recent complaints about sanitation at some fast‑food centres, Deputy Executive Officer of Health Sri Somanarayana has ordered the shop keepers to close their outlets from 11 a.m. to 5 p.m. each Tuesday for deep cleaning. 

This weekly pause will enable thorough removal of accumulated waste, sanitisation of surroundings, and preventive pest control measures — creating a healthier, more welcoming atmosphere for pilgrims.

This Tuesday, fast‑food centres at Third Choultry, PAC‑1, PAC‑2 and other locations underwent deep cleaning. Health inspectors urged shop keepers of various eateries to maintain strict hygiene in food preparation, storage and service, and to keep premises pest‑free. 

The Health Department warned of stern action for non‑compliance. TTD appeals to devotees, shopkeepers and staff to join hands in keeping Tirumala Clean.

తిరుమలలో ఇకపై ప్రతి మంగళవారం ''క్లీనింగ్ డే'' cleaning day







తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భక్తులకు పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ ఆరోగ్యశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆదేశాల మేరకు తిరుమలలోని ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఇకపై ప్రతి మంగళవారం క్లీనింగ్ డే ప్రత్యేకంగా  నిర్వహించాలని నిర్ణయించింది.

ఇటీవల ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల పరిసరాల్లో అపరిశుభ్రత నెలకొంటోందని భక్తుల నుంచి ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో డిప్యూటీ ఈవో శ్రీ సోమన్నారాయణ ఆదేశాల మేరకు ఆరోగ్యశాఖ అధికారులు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.

వారం రోజుల పాటు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే దుకాణాల పరిసరాల్లో పేరుకుపోయే వ్యర్థాలు, మురికి తదితరాలను తొలగించి పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లను మూసివేసి సంపూర్ణంగా శుభ్రం చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.

ఇందులో భాగంగా మంగళవారం తిరుమలలోని మూడో సత్రం, పీఏసీ–1, పీఏసీ–2 తదితర ప్రాంతాల్లోని ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లను మూసివేసి పరిసరాలను శుభ్రం చేశారు.

దుకాణాల్లో బొద్దింకలు, ఎలుకలు, బల్లులు తదితరాలు లేకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రత పాటించాలని ఆరోగ్యశాఖ అధికారులు నిర్వాహకులకు సూచించారు. ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు భక్తులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని ఆదేశించారు.

ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో పరిశుభ్రతకు సంబంధించి భక్తుల నుంచి ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. నిబంధనలు పాటించకుండా దుకాణాలను నిర్వహించే వారిపై టీటీడీ ఆరోగ్యశాఖ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో తిరుమలలో పారిశుధ్యం, ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

SHRAVANA UPAKARMA AT SRI GOVINDARAJA SWAMY TEMPLE ON AUGUST 28


The Sri Govindaraja Swamy Temple, Tirupati, will observe the sacred Shravana Upakarma on August 28 on the occasion of Shravana Pournami, as per Agama traditions.

At 6.30 am, Sri Govindaraja Swamy and Sri Krishna Swamy will be taken in a ceremonial procession to Alwar Theertham at Kapila Theertham, where Snapana Tirumanjanam and Asthanam will be performed.

Later, from 4.30 pm to 6.30 pm, Sri Bhudevi-sametha Govindaraja Swamy will be offered Asthanam at the Sri Vaikhanasacharya Temple on R.S. Mada Street. The deities will then return to the main temple.

TTD appeals to devotees to participate in the sacred Shravana Upakarma and seek the divine blessings of Lord Govindaraja Swamy.