Featured Post

Tondamanpuram Sri Venkateswara Swamy Vari Temple Pavitrotsavams from 26th to28th August

The Pavithrotsavams of Sri Venkateswara Swamy, along with His consorts Sri Devi and Bhu Devi, will be celebrated grandly at Tondaman Puram t...

14.8.26

Tondamanpuram Sri Venkateswara Swamy Vari Temple Pavitrotsavams from 26th to28th August




The Pavithrotsavams of Sri Venkateswara Swamy, along with His consorts Sri Devi and Bhu Devi, will be celebrated grandly at Tondaman Puram temple from August 26 to 28.

The festivities will begin with Ankurarpanam on August 25 at 6 pm as per Agama traditions.

On August 26, Pavitra Pratishta will be performed in the morning, followed by Vedic rituals at the Yagashala in the evening. On August 27, Pavitra Samarpana will be performed in the morning and Chatushtanarchana in the evening.

On August 28, the celebrations will conclude with Maha Poornahuti, Pavitra Vitarana, Snapana Tirumanjanam and Chakrasnanam in the morning. A Gramotsavam will be held in the evening.

As part of the celebrations, devotional music programmes will be organised by the TTD Hindu Dharma Prachara Parishad.

TTD appeals to devotees to participate in the festivities and seek the blessings of Sri Venkateswara Swamy along with Sri Devi and Bhu Devi.

ఆగస్టు 26 నుండి 28వ తేదీ వరకు వైభవంగా తొండమాన్ పురం శ్రీ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు tondaman puram




తొండమాన్ పురంలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 26 నుండి 28 తేదీ వరకు పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.

ఆగస్టు 25న సాయంత్రం 6 గంటలకు శాస్త్రోక్తంగా అంకురార్పణంతో పవిత్రోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.

పవిత్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 26న ఉదయం పవిత్ర ప్రతిష్ఠ, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 27న ఉదయం పవిత్ర సమర్పణ, సాయంత్రం చతుష్టానార్చన చేపడతారు.

ఆగస్టు 28న ఉదయం మహా పూర్ణాహుతి, పవిత్ర వితరణ, స్నపనతిరుమంజనం, చక్రస్నానం నిర్వహించడంతో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ముగుస్తాయి. అనంతరం సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు.

ఈ పవిత్రోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి కృపకు పాత్రులు కావాలని టీటీడీ కోరుతోంది.

13.8.26

SRI MAHALAKSHMI DEEPA PUJA TO BE HELD GRANDLY IN PALAMANER ON AUGUST 14



TTD JEO Dr. A. Sharath directed officials to complete all arrangements for the Sri Mahalakshmi Deepa Puja, to be held at the SVCR Government Junior College premises in Palamaneru on August 14 at 6 pm.

The JEO, along with local MLA and former Minister Sri N. Amarnath Reddy, inspected the arrangements on Wednesday and directed all departments to coordinate closely to ensure a smooth and comfortable experience for devotees.

Extensive facilities are being arranged for thousands of devotees, including spacious shelters, mats, Deepa Puja materials, Annaprasadam distribution centres, drinking water, LED screens and temporary toilets.

Divine ambience at the Deepa Puja venue

The TTD Electrical and Garden departments have been instructed to decorate the venue with illuminations and beautiful floral arrangements and create a serene and spiritually uplifting atmosphere for devotees.

Focus on spiritual experience

MLA and former Minister Sri N. Amarnath Reddy said the arrangements should promote devotion and spiritual awareness among devotees. He also stressed the need to provide all necessary facilities and maintain a peaceful and pleasant atmosphere at the venue.

Live telecast on SVBC

The Sri Venkateswara Bhakti Channel (SVBC) will telecast the Sri Mahalakshmi Deepa Puja live from 6 pm on August 14, the JEO said. He wished that devotees would witness the divine programme and receive the blessings of Sri Mahalakshmi Ammavaru.

HDPP Secretary Dr. Medasani Mohan, DEs Smt. Saraswathi and Sri Sarvesh, AE Sri Chandramouli, SVBC CPO and other officials participated in the inspection.

ఆగష్టు 14న పలమనేరులో వైభవంగా శ్రీ మహాలక్ష్మీ దీప పూజ deepa pooja





పలమనేరులోని ఎస్వీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఆగష్టు 14న శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్న శ్రీ మహాలక్ష్మీ దీప పూజ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీ ఎన్. అమరనాథ్ రెడ్డితో కలిసి బుధవారం ఆయన దీప పూజ ఏర్పాట్లను పరిశీలించారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జేఈవో సూచించారు. వేలాది మంది భక్తుల కోసం విశాలమైన షెడ్లు, మ్యాట్లు, దీపారాధన సామగ్రి, అన్నప్రసాద పంపిణీ కేంద్రాలు, తాగునీటి సౌకర్యం, ఎల్‌ఈడీ స్క్రీన్లు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. 

దివ్య కాంతులతో ముస్తాబవుతున్న దీప పూజ వేదిక

టీటీడీ ఎలక్ట్రికల్, గార్డెన్ విభాగాలు దీప పూజ ప్రాంగణాన్ని విద్యుద్దీపాలు, సుందర పుష్పాలంకరణలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని జేఈవో సూచించారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా పూజా ప్రాంగణంలో పవిత్రమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.

ఆధ్యాత్మిక భావన పెంపొందించేలా ఏర్పాట్లు : ఎమ్మెల్యే

శ్రీ మహాలక్ష్మీ దీప పూజలో పాల్గొనే భక్తుల్లో భక్తిభావం, ఆధ్యాత్మిక చింతన మరింతగా పెంపొందించేలా ఏర్పాట్లు ఉండాలని స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీ ఎన్. అమరనాథ్ రెడ్డి సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించి, పవిత్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరచాలని ఆయన కోరారు.

ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం

శ్రీ మహాలక్ష్మీ దీప పూజ మహోత్సవాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) ద్వారా ఆగష్టు 14న సాయంత్రం 6 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు జేఈవో తెలిపారు. భక్తులు ఈ దివ్య దీప పూజను వీక్షించి, శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో హెచ్‌డీపీపీ కార్యదర్శి డా. మేడసాని మోహన్, డీఈలు శ్రీమతి సరస్వతి, శ్రీ సర్వేశ్, ఏఈ శ్రీ చంద్రమౌళి, ఎస్వీబీసీ సీపీవోతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

SAHASRA KALASABHISHEKAM AND HANUMANTHA VAHANAM SEVA HELD GRANDLY AT SRI KODANDARAMA SWAMY TEMPLE




The Sahasra Kalasabhishekam and Hanumantha Vahanam Seva were performed with devotion and grandeur at Sri Kodandarama Swamy Temple in Tirupati on Wednesday on the occasion of Amavasya.

As per Vaikhanasa Agama traditions, Pournami, Amavasya, Shukla Ekadasi, Krishna Ekadasi, and the Shravanam and Punarvasu stars have special significance in Vaishnava temples. As part of the observance, Sahasra Kalasabhishekam was performed at 8.30 am. Householders (two persons) who participated in the seva by paying Rs.500 were presented with an uttariyam, blouse piece, laddu and vada prasadam.

Hanumantha Vahanam Seva Draws Devotees

The Hanumantha Vahanam Seva was held from 7 pm to 9 pm. Sri Kodandarama Swamy, adorned in rich ornaments, was taken in a grand procession on His favourite Hanumantha Vahanam through the four Mada streets, blessing the devotees.

The divine sight of Lord Kodandarama on the vahanam of Lord Hanuman, the ardent devotee of Lord Rama, delighted devotees. A large number of devotees gathered to witness the sacred procession.

Deputy EO Smt. B. Nagaratna, Superintendent Sri K. Srinivasulu Reddy, Temple Inspector Sri Suresh, temple priests, staff and a large number of devotees participated in the celebrations.





శ్రీ కోదండరామాలయంలో వైభవంగా సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహనసేవ hanumath vahanam



తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో అమావాస్య సందర్భంగా బుధవారం సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహనసేవ భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.

వైఖానస ఆగమం ప్రకారం వైష్ణవ ఆలయాల్లో పౌర్ణమి, అమావాస్య, శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి, శ్రవణం, పునర్వసు నక్షత్రాలకు విశేష ప్రాధాన్యం ఉంది. ఇందులో భాగంగా అమావాస్యనాడు ఉదయం 8.30 గంటలకు సహస్ర కలశాభిషేకం సేవను ఆగమోక్తంగా నిర్వహించారు. రూ.500 చెల్లించి సేవలో పాల్గొన్న గృహస్తులకు (ఇద్దరికి) ఉత్తరీయం, రవికె, లడ్డూ, వడ ప్రసాదాలను అందజేశారు.

భక్తులను కనువిందు చేసిన హనుమంత వాహనసేవ

బుధవారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హనుమంత వాహనసేవను వైభవంగా నిర్వహించారు. సర్వాలంకార భూషితులైన శ్రీ కోదండరామస్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన హనుమంత వాహనాన్ని అధిష్ఠించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

శ్రీరాముని పరమభక్తుడైన ఆంజనేయస్వామి వాహనంపై శ్రీ కోదండరామస్వామివారి దివ్యదర్శనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. స్వామివారి మంగళకర దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి బి. నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ కె. శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్, ఆలయ అర్చకులు, సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.