Featured Post

Pallvotsavam at Tirumala on 22nd July

Commemorating the birth star of the erstwhile Maharaja of Mysore,  TTD will observe the annual Pallavotsavam festival at Tirumala on July 22...

20.7.26

Pallvotsavam at Tirumala on 22nd July




Commemorating the birth star of the erstwhile Maharaja of Mysore,  TTD will observe the annual Pallavotsavam festival at Tirumala on July 22.

After the Sahasra Deepa Alankara Seva, Sri Devi and Bhu Devi together with Sri Malayappa Swamy will be taken on a ceremonial procession to the Karnataka Choultries. The

representatives of the Government of Karnataka and the Mysore royal family offer special Harathi on the occasion.

This festival has been observed for the past 300 years in memory of the Maharaja of Mysore. 

The Mysore Maharaja instituted the daily tradition of offering Navaneetha Harathi and donating five kilograms of ghee each day to the Brahma Deepa and the Maharaja Deepa before the Suprabhatam. This practice continues to the present day.

Chief Pontiff of Sri Rangam Srimath Andavan Ashramam Offered Prayers to Lord Venkateswara









His Holiness Sri Sri Varaha Mahadesikan (Andavan), Chief Pontiff of Srirangam Srimath Andavan Ashramam, offered prayers in Tirumala temple on Sunday.

 He was received at the Sacred Fig tree located near Old Annaprasadam Complex as per temple traditional honours (Pedda Maryada). Later TTD EO Sri Muddda Ravi Chandra, Addl EO Sri Ch. Venkaiah Chowdary welcomed the seer, while the archakas took the Pontiff to Bedi Anjaneya Swamy temple with Isthikapal honours.

TTD Board Member Sri Bhanuprakash Reddy, Temple DyEO Sri Lokanadham, Temple Peishkar Sri Ramakrishna and others were present.

గరుడ వాహనంపై భక్తులకు అభయమిచ్చిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి garuda vahanam




శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించిన సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు ఆదివారం శాస్త్రోక్తంగా ముగిశాయి. ఉత్సవాల చివరి రోజున రాత్రి గరుడ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు అభయహస్తంతో దర్శనమిచ్చి అనుగ్రహించారు.

ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం కల్యాణ మండపంలో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో విశేష అభిషేకాలు నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి సేవను తిలకించారు.

సాయంత్రం ఊంజల్ సేవ అనంతరం రాత్రి 7 గంటలకు ప్రారంభమైన గరుడ వాహన సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గరుడునిపై విహరించిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు భక్తులకు అభయాన్ని ప్రసాదిస్తూ ఆలయ పరిసరాలను ఆధ్యాత్మిక పరవశంతో నింపారు.

జూలై 20 పార్వేట ఉత్సవం

సాక్షాత్కార వైభవోత్సవాల అనంతరం జూలై 20న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.

శ్రీవారిమెట్టు సమీపంలోని పార్వేట మండపంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఉత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రత్యేక ఆస్థానం నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈఓ శ్రీ గోపినాథ్, సూపరింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ మునికుమార్, ఆర్జితం ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనశేఖర్, అర్చకులు, అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తిరుమలలో భక్తులకు ఉప విచారణ కార్యాలయాల ద్వారా సులభంగా వసతి గదుల కేటాయింపు rooms allotment










శ్రీవారి
దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు గదుల కోసం ఇబ్బంది పడకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. గతంలో సీఆర్వో వద్ద గదుల కోసం భక్తులు గంటల కొద్దీ వేచి ఉండే విధానాన్ని మార్పు చేస్తూ భక్తుల అవస్థలు, సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ఉప విచారణ కార్యాలయాల ద్వారా గదులు కేటాయించే విధానాన్ని అమలు చేస్తోంది‌.

భక్తులు ముందుగా తిరుమలలోని కేంద్రీయ విచారణ కార్యాలయం (సీఆర్వో) వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదయం 5 గంటల నుండి సీఆర్వో కార్యాలయం తెరుచుకుంటుంది. గదుల అందుబాటులో ఉన్నంత వరకు సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

భక్తులు క్యూలైన్ లో నిలబడి తమ వంతు వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద తమ ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా జిరాక్స్ కాపీని తీసుకెళ్లి ఫోన్ నెంబర్ వివరాలు తెలియజేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. కౌంటర్ వద్ద రెండు కేటగిరీలకు సంబంధించిన గదుల్లో తమకు నచ్చిన కేటగిరీని ఎంచుకోవచ్చు. 

A కేటగిరీలో రూ.50, రూ.100 గదులు & B కేటగిరీలో రూ.1000 గదులు ఉంటాయి. ఈ ప్రక్రియ పూర్తి కాగానే భక్తులకు ఒక అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ కేటాయించబడుతుంది. క్యూలైన్ల వద్ద భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, అన్న ప్రసాదం, మరుగుదొడ్లు వంటి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.

గదుల కోసం మార్గదర్శకాలు

•  గదులు పొందడానికి 21 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.

•  ఒకసారి గదిని పొందిన వ్యక్తి 30 రోజుల వరకు తిరిగి గదిని పొందలేరు.

•  ఒక కుటుంబం నుండి ఒక వ్యక్తి మాత్రమే క్యూ లైన్ లోకి రావాలి.

•  ఒంటరి వ్యక్తికి లేదా అవివాహితులకు గదులు కేటాయించబడవు.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత సీఆర్వో వద్ద ఉన్న డిస్ప్లే బోర్డులలో వరుస క్రమంలో రిజిస్ట్రేషన్ సంఖ్య కనిపిస్తుంది. తమ క్రమ సంఖ్య కనిపించిన 15 నిమిషాలలోపు తమ సెల్ ఫోన్ కు కేటాయించిన గదికి సంబంధించిన సమాచారం మెసేజ్ రూపంలో అందుతుంది.

ఒకవేళ డిస్ప్లే బోర్డుల్లో తమ రిజిస్ట్రేషన్ క్రమ సంఖ్య వచ్చినప్పటికీ మెసేజ్ రాకపోతే సీఆర్వో వద్ద ఏర్పాటు చేసి కీయోస్క్ మిషన్లలో తమ స్లిప్ స్కాన్ చేస్తే తమకు కేటాయించిన గది వివరాలు చూపిస్తుంది.

అనంతరం భక్తులు వారికి గది కేటాయించిన ప్రాంతంలోని ఉప విచారణ కార్యాలయాలకు చేరుకుని గదికి సంబంధించిన రుసుమును ఆన్ లైన్ (ఫోన్ పే/ గూగుల్ పే/యూపీఐ/క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు ద్వారా మాత్రమే చెల్లించి తాళాలు తీసుకోవాల్సి ఉంటుంది.

తిరుమలలోని ఉప విచారణ కార్యాలయా వివరాలు

•  అంజనాద్రి నగర్ కాటేజస్. (ANC)

•  శ్రేషాద్రి నగర్ కాటేజస్. (SNC)

•  శంఖుమిట్ట కాటేజస్. (SMC)

•  గరుడాద్రి నగర్ కాటేజస్. (GNC)

•  హిల్ వ్యూ కాటేజస్. (HVC)

•  సుదర్శన సత్రం. (1NC)

•  గోవర్ధన్ సత్రం. (2NC)

•  కళ్యాణి సత్రం. (3NC)

•  సప్తగిరి విశ్రాంతి గృహం. (SPRH)

•  రామ్ భగిచా విశ్రాంతి గృహం-2. (RBRH-2)

•  వరాహ స్వామి విశ్రాంతి గృహం -1. (VSRH-1)

•  వరాహ స్వామి విశ్రాంతి గృహం -2. (VSRH-2)

•  అష్ట వినాయక విశ్రాంతి గృహం. (AVSRH)

•  కౌస్తుభం విశ్రాంతి గృహం. (KTBRH)

•  పాంచజన్యం విశ్రాంతి గృహం. (PJMRH)

•  మాతృశ్రీ వకుళామాత విశ్రాంతి గృహం. (MVRH)

•  నందకం విశ్రాంతి గృహం. (NDKRH)

•  సూరాపురం తోట (SPT)

గదులు పొందిన భక్తులు తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలు

•  గదులు 24 గంటలకు మాత్రమే కేటాయించబడతాయి. ఒకవేళ 24 గంటలు దాటితే టారీఫ్ 200 శాతం, 48 గంటలు దాటితే 400 శాతం పెరుగుతుంది.

•  నీరు మరియు విద్యుత్ ను వృథా చేయరాదు.

•  తిరుమలలో ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్లను ఉపయోగించరాదు.

•  జగ్గులు మరియు నీటి గ్లాసులను ఉపయోగించాలి మరియు వాటిని శుభ్రంగా ఉంచాలి.

•  తడి మరియు పొడి చెత్తను వాటికి వేరువేరుగా కేటాయించిన చెత్త బుట్టలలో వేయాలి.

•  భక్తులు వారి వస్తువులను వారే బాధ్యత వహించాలి.

•  గదులు పొందిన భక్తుడు/భక్తురాలు మాత్రమే గది ఖాళీ చేయాల్సి ఉంటుంది. లేకుంటే కాషన్ డిపాజిట్ తిరిగి ఇవ్వబడదు.

•  తమ గదిని వేరొకరికి ఇవ్వడం పూర్తిగా నిషిద్ధం. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయి‌.

భక్తులు పై నిబంధనలను, సూచనలను పాటిస్తూ కలియుగ వైకుంఠమైన తిరుమల పవిత్రతను కాపాడుతూ టీటీడీకి సహకరించగలరని కోరడమైనది.