ప్రముఖ
వైష్ణవాచార్యులు శ్రీ తిరుమలనంబి 1053వ అవతార మహోత్సవం తిరుమలలోని దక్షిణ మాడ వీధిలో గల శ్రీ తిరుమలనంబి ఆలయంలో గురువారం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా వేద పండితులు వేద పారాయణం, ప్రబంధ పారాయణం, రామాయణం, ఇతిహాసాది పురాణాలను శ్రావ్యంగా పటించారు. ఈ కార్యక్రమంలో తిరుమల నంబి వంశీయులైన టి.కె.శేషాద్రి స్వామి, టి.కె.ముకుంద తాతాచార్యులు, మరియు తిరుమల నంబి వంశీయులు పాల్గొన్నారు. కాగా రేపు ఉదయం శ్రీవారి తొలి ఘంట నైవేద్యాన్ని తిరుమల నంబి వారికి సమర్పిస్తారు. అనంతరం 16 మంది ప్రముఖ పండితులు తిరుమలనంబి జీవిత చరిత్రపై ఉపన్యసిస్తారు.
No comments :
Write comments