ఒంటిమిట్ట శ్రీ
ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్, ఈవో శ్రీ జె.శ్యామలరావుతో కలి సి మీడియా సమావేశంలో మాట్లాడు తూ, టీటీడీ ధర్మకర్తల మండ లి తీసుకున్న నిర్ణయాలను వివ రించారు. వివరాలు.......
• తిరుమలలో రోజురోజుకు పెరుగుతు న్న శ్రీవారి భక్తుల రద్దీకి అనుగుణంగా భవిష్యత్ అవసరాల దృష్ ట్యా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మించేందుకు సాధ్యసాధ్యా లను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ వేయాలని నిర్ణయం.
• తిరుమలలో భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల్లో అన్ని వసతు లతో విశ్రాంతి కేంద్రాలు (లాంజ్ లు) ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని నిర్ ణయం.
• అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో భక్తులకు సౌకర్యవంతం గా ఉండేలా మౌలిక వసతులు, లైటిం గ్, భద్రత, ఆధ్యాత్మిక ఆహ్లా దకర వాతవరణం పెంపొందించేందుకు నిర్ణయం.
• తిరుమలలోని శిలాతోరణం, చక్రతీ ర్థం ప్రాంతాలను మరింత అభివృద్ ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ మరియు డీపీఆర్ రూపొందించాలని ని ర్ణయం.
• ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మే రకు శ్రీవారి వైభవాన్ని విశ్వవ్ యాప్తం చేసేందుకు, వివిధ దేశాల్ లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి నిపుణుల కమిటీ నివేదిక సమర్పిం చింది. దీనిపై టీటీడీ ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసి సదరు కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయం.
• శ్రీవారిసేవను మరింత విస్తృత పరిచి భక్తులకు స్వచ్ఛంద సేవను మరింత పటిష్టంగా అమలు చేసేందు కు 4 కోఆర్డినేటర్ పోస్టులను కాం ట్రాక్ట్ ప్రాతిపాదికన భర్తీ చే సేందుకు ఆమోదం.
• శ్రీవారి భక్తులు సైబర్ మోసా లకు గురికాకుండా నియంత్రించేందు కు సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్ పాటుకు ఆమోదం.
• తిరుమలలోని కళ్యాణకట్టలో భక్తు లు తలనీలాలు సమర్పించేందుకు మరిం త మెరుగైన సౌకర్యాలతో పాటు పారి శుద్ధ్యం, భద్రతను పెంపొందించేం దుకు నిపుణులను సంప్రదించి కార్ యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయం.
• తిరుమలలో పరిపాలన సౌలభ్యం కోసం అన్ని విభాగాలు ఒకచోట కేంద్రీ కృతమయ్యేలా నూతన పరిపాలన భవనం నిర్మాణానికి ఆమోదం. అదేవిధంగా తిరుమలలో పాత బడిన హెచ్వీడీసీలో ని ఆరు బ్లాకులు, బాలాజీ విశ్రాం తి గృహం, ఆంప్రో గెస్ట్ హౌస్, అన్నపూర్ణ క్యాంటీన్, కళ్యాణి సత్రాలను ఐఐటీ నిపుణుల సూచన మే రకు తొలగించాలని నిర్ణయం.
• పదకవితా పితామహుడు అన్నమయ్య జన్మించిన తాళ్లపాకలో పలు అభివృ ద్ధి కార్యక్రమాల కోసం నిపుణు లతో కార్యాచరణ ప్రణాళిక రూపొంది చాలని నిర్ణయం.
• సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యం లో ఇటీవల నూతనంగా నిర్మించిన 320 ఆలయాలకు రూ.79.82 లక్షలతో మైక్ సెట్లను ఉచితంగా అందించా లని నిర్ణయం. ఒక్కొక్క మైక్ సె ట్ ఖర్చు రూ.25 వేలు.
• వేద పరిరక్షణలో భాగంగా ని రుద్యోగులైన వేద పారాయణదారులకు దేవదాయశాఖ ద్వారా నిరుద్యోగ భృతిని చెల్లించేందుకు రూ.2. 16 కోట్ల టీటీడీ నిధులు మంజూరు కు ఆమోదం.
• రాష్ట్ర దేవాదాయశాఖ సూచనల మే రకు శ్రీవాణి ట్రస్టు ఆధ్వర్యం లో ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన ప్ రాంతాల్లో నిర్మించే శ్రీవారి ఆలయాలు, భజన మందిరాలకు నిధులు చెల్లిం చేందుకు మూడు కేటగిరీలుగా వి భజన. మూడు కేటగిరీల్లో రూ.10 లక్షలు, రూ.15 లక్షలు, రూ.20 లక్షలుగా నిర్ణయం తీసు కున్నాం. ఇప్పటి వరకు ఒకే కేటగి రీ కింద రూ.10 లక్షలు చెల్లించే విధానంలో మార్పు.
• ఏపీ హైకోర్టు తీర్పు మేరకు టీ టీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్లుగా పని చేస్తున్న 142 మందిని క్ రమబద్ధీకరించేందుకు ఆమోదిస్తూ ప్రభుత్వ ఆమోదానికి పంపాలని ని ర్ణయం.
ఈ సమావేశంలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, పలువు రు బోర్డు సభ్యులు, జెఈవో శ్రీ వీరబ్రహ్మం పాల్గొన్నారు.












No comments :
Write comments