తిరుమల శ్రీవారి
ముందుగా ఉదయం 7 నుండి 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘం టా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ ప స్వామి వారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చే శారు. మరో పీఠంపై స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడైన శ్రీ వి ష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు. అనంతరం ఆనంద నిలయంలోని మూల విరాట్టుకు, బంగా రు వాకిలి వద్ద ఆస్థానంలో వేంచే పు చేసిన ఉత్సవమూర్తులకు ప్రత్ యేకపూజలు, ప్రసాదాలు నివేదించా రు.
అనంతరం శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పె ట్టుకొని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేశారు. శ్రీశ్ రీశ్రీ చిన్నజీయర్స్వామి, టి టిడి ఈవో, ఇతర ఉన్నతాధికారులు వెంట వచ్చారు. నాలుగు పట్టు వస్ త్రాలను మూలవిరాట్టుకు అలంకరిం చారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామి వారికి, మరొ కటి విష్వక్సేనులవారికి అలంకరిం చారు.
తదనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాద వస్త్రంతో ”పరివట్టం”(చిన్న పట్ టుగుడ్డ) కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరిం చి ‘నిత్యైశ్వర్యోభవ’ అని స్వా మివారిని ఆశీర్వదించారు. ఆ తరు వాత అర్చకులు శ్రీశ్రీశ్రీ పెద్ ద జీయర్ గారికి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ గారికి, టీటీడీ తరఫున ఈవోకి ‘లచ్చన’ అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కు డిచేతికి తగిలించారు. ”రూపాయి” హారతి, చందనం, తాంబూలం , తీర్థం, శఠారి మర్యాదలు చేసి న అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచడంతో ఆణివార ఆస్థానం ముగిసింది.
వార్షిక లెక్కలు ప్రారంభించిన రోజు :
సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమా నం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలం లో కర్కాటక సంక్రాంతినాడు ఈ ఉత్ సవాన్ని నిర్వహిస్తారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడం తో ఆణివార ఆస్థానం అని పేరు వ చ్చింది. పూర్వం మహంతులు దేవస్ థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వది నంనాటి నుండి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షి క లెక్కలు ప్రారంభమయ్యేవి. టీటీ డీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తరు వాత వార్షిక బడ్జెట్ను మార్చి – ఏప్రిల్ నెలలకు మార్చారు. సా యంత్రం పుష్పపల్లకీపై స్వామి , అమ్మవారు నాలుగు మాడ వీధుల్ లో భక్తులకు దర్శనమిస్తారు .
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, శ్ రీ నరేష్ కుమార్, శ్రీ శాంతా రా మ్, శ్రీ సదాశివరావు, శ్రీ జంగా కృష్ణమూర్తి, శ్రీమతి జానకి దే వి, శ్రీ మహేందర్ రెడ్డి, అదన పు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌ దరి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లో కనాథం, ఇతర అధికారులు పాల్గొన్ నారు.

No comments :
Write comments