16.7.25

శ్రీరంగం నుండి తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ Srirangam temple





ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం శ్రీ రంగ‌నాథ‌స్వామి తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.


బుధ‌వారం ఉదయం శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన గల తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి మఠంలో శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడినుండి తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ బిఆర్ నాయుడు, ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు, తమిళనాడు దేవాదాయ శాఖ కార్యదర్శి శ్రీ శ్రీ‌ధ‌ర‌న్ కలిసి పట్టువస్త్రాలను మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా నాలుగు మాడ వీధుల ప్ర‌ద‌క్షిణ‌గా ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో తమిళనాడు దేవాదాయ శాఖ అద‌న‌పు కార్య‌ద‌ర్శి మ‌ణివాస‌గం, శ్రీరంగం ఆలయ జాయింట్ కమిషనర్ శ్రీ శివ‌రామ్ కుమార్‌, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ సుంద‌ర బ‌ట్ట‌ర్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments :
Write comments