అలిపిరి
చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేయనున్న సెక్యూరిటీ లగేజీ స్కానర్ కోసం శుక్రవారం ఇండియన్ బ్యాంక్ రూ.37,97,508 టీటీడీకి విరాళంగా అందించింది.
ఈ మేరకు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి ఇండియన్ బ్యాంక్ ఫీల్డ్ మేనేజర్ శ్రీ ప్రణేశ్ కుమార్ విరాళం డీడీని అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ శ్రీ ఎం.సెల్వరాజ్, డిప్యూటీ జోనల్ మేనేజర్ శ్రీమతి ఇందిరా, తిరుమల బ్రాంచ్ మేనేజర్ శ్రీ రాఘవేంద్ర పాల్గొన్నారు.
No comments :
Write comments