తిరుపతి
శ్రీ కపిలేశ్వరాలయంలో కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం కృత్తికా దీపోత్సవం ఘనంగా జరిగింది.
సాయంత్రం గర్భాలయంలో, ఆ తరువాత శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయ గోపురం, శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ గోపురం, ధ్వజస్తంభంపైన దీపారాధన చేశారు. ఈ సందర్భంగా ఊంజల్ మండపంలో ఆకట్టుకునేలా శివలింగం, శూలం ఆకృతిలో ప్రమిదలు వెలిగించారు.ఆ తరువాత జ్వోలాతోరణం వెలిగించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో శ్రీ వి.వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఆలయ సూపరింటెండెంట్ శ్రీ కెపి చంద్రశేఖర్, అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
No comments :
Write comments