19.1.26

శాస్త్రోక్తంగా దేవుని క‌డ‌ప శ్రీ ల‌క్ష్మీ వేంక‌టేశ్వ‌ర స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ devuni kadapa







దేవుని క‌డ‌ప శ్రీ ల‌క్ష్మీ వేంక‌టేశ్వ‌ర స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.


ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపితోమాలసహస్రనామార్చన చేశారుసాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు సేనాధిపతి ఉత్సవంమేదినీపూజమృత్సంగ్రహణంశాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.


 కార్య‌క్ర‌మంలో ఆల‌య డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతిటెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఈశ్వర్ రెడ్డిఅధికారులుఅర్చ‌కులుభ‌క్తులు పాల్గొన్నారు.


జ‌న‌వ‌రి 19 ధ్వజారోహణం :


జ‌న‌వ‌రి 19 సోమ‌వారం ఉదయం 10 నుండి 10.30 గంటల మధ్య ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయిఇందులో భాగంగా ఉదయం స్వామిమ్మ‌వార్లుధ్వజపటముచక్రతాళ్వారులకు తిరువీధి ఉత్సవం జరుగనుందిఅనంతరం శ్రీ ల‌క్ష్మీ వేంక‌టేశ్వ‌ర స్వామివారి సమక్షంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.


No comments :
Write comments