శ్రీమాన్
వేటూరి ప్రభాకర్ శాస్త్రి ప్రజ్ఞా ప్రభాకరుడని, యోగ మార్గాన్ని అనుసరించారని టిటిడిపురాణేతిహాస ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి డా. ధూళిపాళ ప్రభాకర కృష్ణమూర్తి అన్నారు. వేటురి వారికి యోగబలం, సంకల్ప బలంమూలంగా ఇన్ని రచనలు చేయగలిగారని, ఎన్నో పరిశోధనా గ్రంథాలను పరిష్కరించారని ప్రశంసించారు. శ్రీమాన్ వేటూరి ప్రభాకర్శాస్త్రి 138వ జయంతి సందర్భంగా శనివారం ఉదయం తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో సాహితీ సదస్సు నిర్వహించారు.
అనంతరం బహుముఖ ప్రజ్ఞాశాలి బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి అనే అంశంపై హైదరాబాద్ విశ్వవిద్యాలయం విశ్రాంతాచార్యులుఆచార్య రేమళ్ళ వేంకటరామకృష్ణ శాస్త్రి మాట్లాడారు. వేటూరి వారు శాసన పరిశోధకులుగా, సాహిత్య పరిశోధకులుగా, భాషావేత్తగా, యోగి సత్వమునిగా, కవిగా, పండితునిగా తన బహుముఖ ప్రజ్ఞను చాటారని తెలియజేశారు.
అటు తర్వాత, తాళ్ళపాక కవుల సాహిత్య ఉద్ధరణలో వేటూరి వారి కృషి అనే అంశంపై శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం ప్రాచ్యపరిశోధనా సంస్థ ప్రతినిధి డా. టి. రాజశేఖర్ మాట్లాడారు. వేటూరి వారి కరస్పర్శ తగలనిదే అన్నమాచార్యుల సంకీర్తనలువెలుగులోకి రాలేదని, తొలి తెలుగు కవయిత్రి తాళ్లపాక తిమ్మక్క కూడా వేటూరి వారి ద్వారానే వెలుగులోకి వచ్చారన్నారు. తాళ్లపాకవాంగ్మయాన్ని సంపూర్ణంగా వెలుగులోకి తీసుకురావాలని సంకల్ప బలంతో పనిచేశారని కొనియాడారు. వేటూరి వారు టీటీడీకిఅందించిన సేవలు, శ్రీ తాళ్ళ పాక అన్నమాచార్యులు శ్రీ వేంకటేశ్వర స్వామి పై రచించిన కీర్తనలు వెలుగులోకి తేవడానికి చేసినపరిశోధనల గురించి వక్తలు గుర్తు చేసుకున్నారు.
ముందుగా అన్నమాచార్య కళామందిరంలో శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి సాహితీసదస్సును ప్రారంభించారు.
అంతకుముందు, శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి 138వ జయంతి సందర్బంగా శనివారం శ్వేత భవనం ఎదురుగా, టీటీడీ ప్రాచ్యకళాశాలలో ఉన్న శ్రీ వేటూరి విగ్రహాలకు అన్నమాచార్య ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ డా. మేడసాని మోహన్, ఎస్వీ ఓరియంటర్ కాలేజ్ప్రిన్సిపాల్ డా. సీతారామారావు, అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డా. సి. లత, అధ్యాపకులు పుష్పమాలలు సమర్పించారు.
No comments :
Write comments