శ్రీవేంకటేశ్వరుని నామసంకీర్తన ద్వారా సమాజంలో అశాంతి దూరమవుతుందని టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనంద తీర్థాచార్యులు చెప్పారు. టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ కార్యక్రమం తిరుమల ఆస్థాన మండపంలో ఆదివారం వైభవంగా ప్రారంభమైంది.
ఈ సందర్భంగా దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ప్రసంగిస్తూ, వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భజన మండళ్ల సభ్యులకు ఆస్థాన మండపంలో ధార్మిక శిక్షణ, హరిదాస కీర్తనల్లో అంత్యాక్షరి, దాస సాహిత్యంలో రసప్రశ్నల స్పర్థ, సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. ఇక్కడ శిక్షణ పొందిన సభ్యులు తమ తమ ప్రాంతాలకు వెళ్లి భక్తజనావళికి సనాతన ధార్మిక అంశాలపై శిక్షణ ఇస్తారని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకకు చెందిన 3 వేల మంది భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.
No comments :
Write comments