శ్రీ
కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరవ రోజైన శుక్రవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక వేదిక ఏర్పాటు చేసిన భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులలో మరింత ఆధ్యాత్మిక భక్తి భావాన్ని పెంచింది.
ఇందులో భాగంగా సాయంత్రం 5:30 గంటలకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల నాదస్వర విభాగ అధ్యాపకులు శ్రీ రవిప్రభ బృందం "వర వల్లభ...., సభాపతి...., సదానంద తాండవం...., పరంధామవతి మహాదేవ శివ శంభో....," అను కృతులు ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తదుపరి సాయంత్రం 6:30 గంటల నుండి ఎస్వీ సంగీత కళాశాల వీణ విభాగ అధ్యాపకులు శ్రీమతి జ్ఞానప్రసూన బృందం " శ్రీవిఘ్నరాజం....., సాంబ శివాయనేవే ...... , లింగాష్టకం....., భో శంభో....." వంటి కృతులతో వాయించి భక్తులను అలరించారు.
తరువాత రాత్రి 7:30 గంటల వరకు ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ డా|| శ్రీమతి ఉమా ముద్దుబాల బృందం " శ్రీ విఘ్నరాజం భజే..... , నటేశ కౌత్వం...., మల్లారి..... , అర్ధనారీశ్వర నృత్యం ......, శంకర శ్రీగిరి..... , భో శంభో.... , శంభో మహాదేవ.... , దేవీ స్తుతి....." వంటి అంశాలు అందరిని ఆకట్టుకున్నాయి.
No comments :
Write comments