14.3.26

మార్చి 19న శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో ఉగాది ఆస్థానం - మార్చి 16న‌ కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం sri govindaraja swamy vari temple




తిరుపతి శ్రీ గోవిందరాజ‌స్వామివారి ఆలయంలో మార్చి 19 ఉగాది ప‌ర్వ‌దినం సందర్భంగా ఆస్థానం జ‌రుగ‌నుంది.


ఇందులో భాగంగా సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలకొలువుపంచాంగ శ్రవణంఅర్చన నిర్వహిస్తారుసాయంత్రం 4.30 నుండి 6 గంట‌ల వ‌ర‌కు  పంచాంగ శ్రవణంఉగాది ఆస్థానం జ‌రుగ‌నుంది.


కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం


శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మార్చి 16 తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారుమార్చి 19 ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.


ఇందులో భాగంగా సోమ‌వారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవకొలువుపంచాంగశ్రవణం నిర్వహిస్తారుఉదయం 7 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుందిఇందులో ఆలయ ప్రాంగణంగోడలుపైకప్పుపూజాసామగ్రి తదితర న్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపుశ్రీచూర్ణంకస్తూరి పసుపుపచ్చాకుగడ్డ కర్పూరంగంధం పొడికుంకుమకిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారుఅనంతరం భక్తులను ఉదయం 9.30 గంటల నుండి దర్శనానికి అనుమతిస్తారు.


No comments :
Write comments