తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం చక్రస్నానం వైభవంగా జరిగింది.
ముందుగా ఉదయం 7.00 గం.లకు వసంతోత్సవం నిర్వహించారు. తదుపరి ఉదయం 10 గం.లకు స్నపన తిరుమంజనం నిర్వహించి అనంతరం వైభవంగా చక్నస్నానం చేపట్టారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకాలు చేశారు. అనంతరం అర్చకులు వేదమంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.
రాత్రి 07.00 గం.లకు తిరుచ్చి ఉత్సవం చేపట్టి రాత్రి 08.00 గం.లకు ధ్వజావరోహణం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంతో శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, అర్చకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments