6.3.26

రామతీర్థం గుట్టలో పచ్చదనం పెంపుపై టిటిడి ప్రత్యేక దృష్టి raama theertham







ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం సమీపంలోని రామతీర్థంలక్ష్మణతీర్థం గుట్టల్లో పచ్చదనం పెంచేందుకు టిటిడి ప్రత్యేక చర్యలు చేపడుతోందిఒంటిమిట్ట ఆలయం పరిసర ప్రాంతాల్లో పచ్చదనం మరింత పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.


 మేరకు టిటిడి అటవీ శాఖ వాతావరణంకు అనుకూలంగా దీర్ఘకాలికంగా చెట్లు పెరిగేలా ప్రణాళికలు రూపొందించిందిటిటిడి జేఈవో శ్రీ వివీరబ్రహ్మం గురువారం రామతీర్థం గుట్టను పరిశీలించి అటవీ శాఇంజనీరింగ్ శాఖ అధికారులకు లు సూచనలు చేశారు.


రామతీర్థంలక్ష్మణతీర్థం గుట్టలు కలిపి సుమారు 10 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నాయి ప్రాంతం ఎక్కువగా పెద్ద రాళ్లతో ఉండటంతోరాళ్ల మధ్య కూడా పెరిగే జాతికి చెందిన మొక్కలను నాటే కార్యక్రమం ప్రారంభించారు.


ప్రయోగాత్మకంగా రావిమర్రితెల్లమద్దిజీలుగు వంటి చెట్లను నాటారుదశలవారీగా దాదాపు 3 వేల చెట్లను నాటేందుకు టిటిడి ప్రణాళికలు సిద్ధం చేసిందిరాళ్ల మధ్యలో కూడా  చెట్లు బాగా పెరిగేలా ప్రారంభ దశలో ప్రత్యేకంగా సంరక్షణ చేపడుతున్నారు.


ప్రణాళికాబద్ధంగా మొక్కలు నాటి ఒంటిమిట్ట పరిసర ప్రాంతాన్ని పచ్చదనంతో నింపేందుకు టిటిడి చర్యలు చేపట్టింది.


 కార్యక్రమంలో సీఈ శ్రీ టి.వి. సత్యనారాయణటిటిడి అటవీ శాఖ ధికారి విజయకుమార్ మరియు ఇతర అధికారులుసిబ్బంది పాల్గొన్నారు.

No comments :
Write comments