23.4.26

శాస్త్రోక్తంగా శ్రీ కోదండరామస్వామివారి పుష్పయాగానికి అంకురార్పణ ankurarpanam

 





తిరుపతి శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 23 తేదీ గురువారం నిర్వహించనున్న పుష్పయాగానికి బుధవారం సాయంత్రం శాస్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.


 ఆలయంలో మార్చి 17 నుండి 25 తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించబడిన విషయం తెలిసిందేబ్రహ్మోత్సవాల సమయంలో అర్చకులుఅధికారులుభక్తుల వల్ల తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు యాగం వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.


ఏప్రిల్ 23 తేదీన పుష్పయాగం సందర్భంగా  ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు స్వామివారుఅమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారుఅనంతరం సాయంత్రం 4.00 గంటల నుండి 6.00 గంటల వరకు సీతా లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారికి వివిధ కాల పుష్పాలతో అభిషేకం నిర్వహించబడుతుంది.


తదుపరి రాత్రి 7.00 గంటలకు శ్రీ సీతా రామ లక్ష్మణ స్వామివారు లయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తూ ఆశీర్వదిస్తారు.


 పుష్పయాగంలో గృహస్తులు (ఇద్దరురూ.1,000/- చెల్లించి టికెట్ కొనుగోలు చేసి పాల్గొనవచ్చు.


 కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నటెంపుల్ ఇస్పెక్టర్లు శ్రీ సురేష్ బాబుశ్రీ రికృష్ణఆలయ అర్చకులుఇతర అధికారులు పాల్గొన్నారు.


No comments :
Write comments