ఒంటిమిట్ట
శ్రీ
కోదండరామస్వామి
వార్షిక
బ్రహ్
మోత్సవాల్లో
భాగంగా
ఐదో
రోజు
మం
గళవారం
రాత్రి
గరుడ
వాహనంపై
శ్
రీ
సీతారామలక్ష్మణులు
భక్తులకు
అభయమిచ్చారు
.
రాత్రి 7 నుండి వాహనసేవ వైభవంగా జరిగింది. కేరళ డ్రమ్స్, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
గరుత్మంతుడు శ్రీమహావిష్ణువుకు నిత్యవాహనం. దాసుడుగా, సఖుడుగా, విసనకఱ్ఱగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, వాహనంగా ధ్వజంగా అనేక విధాల సేవలందిస్తున్న నిత్యసూరులలో అగ్రగణ్యుడైన వైనతేయుడు కోదండరామస్వామిని వహించి కదిలే తీరు సందర్శనీయమైనది. 108 దివ్య దేశాలలోనూ గరుడ సేవ విశిష్టమైనది.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు శ్రీమతి ప్రశాంతి, శ్రీ శివప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
No comments :
Write comments