టిటిడి ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు హైదరాబాద్కు చెందిన భక్తురాలు శ్రీమతి చెవూరి ఉషశ్రీ రూ.25 లక్షల విరాళాన్ని అందజేశారు.
తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడును కలిసి ఆమె విరాళం చెక్కును అందించారు.
ఈ సందర్భంగా దాతృత్వం చాటిన శ్రీమతి ఉషశ్రీని టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు అభినందించి, ఆమెకు శ్రీ వేంకటేశ్వర స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ మల్లెల రాజశేఖర్ గౌడ్, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
No comments :
Write comments