31.8.26

పదవీ విరమణ ఉద్యోగుల అనుభవాలు భవిష్యత్తు తరాలకు అమూల్య మార్గదర్శకాలు – టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర ttd retaired employees







టీటీడీలో సుదీర్ఘకాలం అంకితభావంతో సేవలందించి పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగు అనుభవాలు సంస్థకు ఎంతో విలువైనవని, వారి సేవానుభవాలు భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర అన్నారు.


తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో టీటీడీ ఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో సోమవారం 16 మంది పదవీ విరమణ ఉద్యోగులకు సామూహిక సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టిటిడి ఈవో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.


సేవానుభవాలు.. భవిష్యత్ తరాలకు విలువైన పాఠాలు


ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, టీటీడీలో ఎన్నో సంవత్సరాలుగా విధులు నిర్వహించిన ఉద్యోగులు తమ సేవా కాలంలో ఎదుర్కొన్న ముఖ్యమైన సంఘటనలు, సవాళ్లు, వాటిని అధిగమించిన విధానాలు, విధి నిర్వహణలో పొందిన అనుభవాలను నోట్ రూపంలో సిద్ధం చేసి సహచర ఉద్యోగులతో పంచుకోవాలని సూచించారు.


అనుభవజ్ఞులైన ఉద్యోగుల నుంచి లభించే ఈ విలువైన జ్ఞానం భవిష్యత్తులో ఉద్యోగులు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు దోహదపడుతుందని తెలిపారు.

No comments :
Write comments