శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన గురువారం తిరుమలలోని నాదనీరాజనం, ఆస్థాన మండపంలలో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ధార్మిక, సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇందులో భాగంగా నాదనీరాజనం వేదికపై ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకుశ్రీమతి రవిప్రభ, శ్రీ ఆర్.సత్యనారాయణ బృందం మంగళ ధ్వని, ఉదయం 5:30 నుండి 6:30 గంటల వరకు ఎస్వీ ఉన్నత వేద విద్యాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో వేద సందేశం నిర్వహించారు. సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు తిరుపతికి చెందిన ఆర్.బుల్లెమ్మ బృందం భక్తి సంగీతం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించింది.
ఆస్థాన మండపంలో ఉదయం 7 నుండి 8 గంటల వరకు హైదరాబాద్కు చెందిన శ్రీమతి రామానుజమ్మ బృందం విష్ణు సహస్రనామ పారాయణం, ఉదయం 10 నుండి 11:30 గంటల వరకు బెంగుళూరుకు చెందిన శ్రీమతి రూపశ్రీ భక్తి సంగీతం, ఉదయం 11:30 నుండి 12:30 గంటల వరకు తిరుపతికి చెందిన డాక్టర్ పి.టి.జి.సంపత్ కుమార్ భక్తి సందేశం అందించారు.
సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి ఆర్.సుశీల బృందం అన్నమయ్య సంకీర్తనలు భక్తులను అలరించాయి. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి స్వర్ణలత బృందం హరికథ గానం చేశారు.






No comments :
Write comments