ఎనిమిది రాష్ట్రాలకు చెందిన 21 కళాబృందాల్లో 551 మంది కళాకారులు తమ అద్భుతమైన ప్రదర్శనలతో తిరుమాడ వీధులను కళా వైభవంతో నింపారు.
రాజస్థాన్ ఘూమర్, కర్ణాటక డొల్లు కుణిత, సుగ్గి కుణిత, మహారాష్ట్ర డ్రమ్ విన్యాసాలు, తెలంగాణ బతుకమ్మ, రాస్–గర్భా, ఉత్తరాఖండ్ సంప్రదాయ కళారూపాలు, ఆంధ్రప్రదేశ్ కూచిపూడి, చెక్కభజన, డప్పు నృత్యం, జాలరి నృత్యం, కోలాటం తదితర కళారూపాలు భక్తులను అలరించాయి.
వివిధ రాష్ట్రాల సంప్రదాయ కళల సమ్మేళనంతో తిరుమాడ వీధులు కళా వైభవాన్ని సంతరించుకోగా, కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామివారి దివ్య మంగళ దర్శనం భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది.
నాలుగుఉత్తమకళాబృందాలకుఈవోసన్మానం
వాహనసేవలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నాలుగు కళాబృందాలను టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర శాలువతో సన్మానించారు.
- ఎస్వీ సంగీత నృత్య కళాశాల – శ్రీ బాలాజీ బృందం, భరతనాట్యం, పుత్తూరు, ఆంధ్రప్రదేశ్ – 23 మంది.
- అన్నమాచార్య ప్రాజెక్టు – శ్రీ కెంచప్ప బృందం, సుగ్గి కుణిత, కర్ణాటక – 23 మంది.
- దాస సాహిత్య ప్రాజెక్టు – శ్రీ రాహుల్ ముఖర్జీ బృందం, ఒడిస్సీ, వారణాసి, ఉత్తరప్రదేశ్ – 27 మంది.
- హిందూ ధర్మ ప్రచార పరిషత్తు – శ్రీ కె. నాగరాజు బృందం, డొల్లు కుణిత, బెంగళూరు, కర్ణాటక – 30 మంది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తి, సంప్రదాయం, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా వివిధ రాష్ట్రాల కళాకారులు అందిస్తున్న ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతున్నాయి.
No comments :
Write comments