4.9.26

రిసెప్షన్ విభాగంపై అదనపు ఈవో సమీక్ష ttd addl eo




నెల 15 నుండి 23 తేది వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతి గదుల కేటాయింపునకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య ఆదేశించారు.

గురువారం తిరుమలలోని  సుధర్మ సమావేశ మందిరంలో రిసెప్షన్ విభాగంపై అదనపు ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గదులకు మరమ్మతులు ఏవైనా ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు.

బ్రహ్మోత్సవ విధులకు డిప్యూటేషన్ పై వచ్చే సిబ్బందికి వసతి కేటాయించేందుకు వీలుగా తిరుమలలోని మఠాలు, కర్ణాటక సత్రాల్లోని 60 శాతం గదులను బ్రహ్మోత్సవ రోజుల్లో టీటీడీ రిసెప్షన్ విభాగం నియంత్రణలోకి తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో తిరుమల ఎస్టేట్ అధికారి శ్రీ వేంకటేశ్వర్లు, ఇన్ ఛార్జ్ ఐటీ జీఎం శ్రీ వేంకటేశ్వర్లు నాయుడు, రిసెప్షన్ ఓఎస్డీ శ్రీ సత్రే నాయక్, ఏఈఓ శ్రీ అశోక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments