తిరుమల
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు గురువారం రాత్రి జరిగిన ముత్యపుపందిరి వాహనసేవను వీక్షించేందుకు గ్యాలరీలకు వచ్చిన భక్తులతో టీటీడీ ఛైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు ముచ్చటించారు.
ఈ సందర్భంగా భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలు, బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లపై ఆయన స్వయంగా భక్తులను అడిగి తెలుసుకున్నారు. శ్రీవారి దర్శనం, అన్నప్రసాదం, వసతి, లడ్డూ ప్రసాదం, వాహనసేవల వీక్షణకు చేసిన ఏర్పాట్లు తదితర అంశాలపై భక్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
టీటీడీ అందిస్తున్న సౌకర్యాలు, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వారి సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని ఛైర్మన్ తెలిపారు.
కళాబృందాల ప్రదర్శనలు పరిశీలించిన ఛైర్మన్
అనంతరం వివిధ కళాబృందాలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను టీటీడీ ఛైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు, పాలకమండలి సభ్యులు పరిశీలించారు. అద్భుతమైన కళా ప్రదర్శనలు అందించిన కళాకారులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నరేష్ కుమార్, శ్రీమతి టి. జానకీదేవి, శ్రీమతి ఎ. రంగశ్రీ తదితరులు పాల్గొన్నారు.
No comments :
Write comments