1.9.26

వేగంగా సాగుతున్న వేంకటపాలెం శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు venkatapalem temple


అమరావతిలోని వేంకటపాలెం శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణ పనులను టీటీడీ జేఈవో డా. . శరత్ సోమవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆలయంలోని 2వ ప్రాకారం, నాలుగు గాలి గోపురాల నిర్మాణ పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 

నిర్మాణ పనుల్లో ఎలాంటి అలసత్వానికి తావులేకుండా నిరంతరం పర్యవేక్షించాలని, పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని సూచించారు. పనుల సందర్భంగా ఎదురయ్యే సమస్యలను వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.

అనంతరం జేఈవో శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను అందించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఈ శ్రీ సురేంద్ర, సూపరింటెండెంట్ శ్రీ మల్లికార్జున, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రామకృష్ణ, అర్చకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

భక్తుల ఆహార భద్రత పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలి హోటల్ నిర్వాహకులతో సమావేశంలో అదనపు ఈవో food safety


తిరుమలలోని హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో క్తులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని తయారు చేసి భక్తుల ఆహా భద్రతపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి అన్నారు.

బ్రహ్మోత్సవాలు రానున్న నేపథ్యంలో తిరుమలలోని ఆస్థాన మండపంలో హోటల్ నిర్వాహకులతో టీటీడీ అదనపు ఈవో సోమవారం సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోటల్ పరిశుభ్రత, ఫుడ్ ప్రాసెసింగ్ పై గత రెండేళ్లలో తిరుమలలోని వివిధ హోటల్ యాజమాన్యాలకు, నిర్వాహకులకు అనేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించామన్నారు.

భక్తుల ఆహార భద్రతే మనందరి ప్రధమ బాధ్యత అన్నారు. ఇకపై ప్రతినెలా తప్పనిసరిగా కనీసం 10 నుండి 15 శాంపిల్స్ తో నూతన ఆధునిక ఆహార పదార్థాల పరీక్షల్యాబ్లో టెస్టులు నిర్విహిస్తామని చెప్పారు.

ల్యాబ్ టెస్టుల్లో నిబంధనలకు అతీతంగా ఫలితాలు వస్తే రూ.5 లక్షల జరిమాన,  తమకు కేటాయించిన దుకాణాన్ని సీజ్ చేసేటటువంటి చర్యలు కూడా ఉంటాయన్నారు. అదేవిధంగా హోటల్ నిర్వాహకులు తమకు కేటాయించిన స్థలాన్ని దాటి ఆక్రమణలకు పాల్పడ రాదన్నారు.

త్వరలో తిరుమలలోని హోటళ్లలోని వంట గదులను ఆడిటింగ్ చేసి భద్రతా ప్రమాణాలపై సర్టిఫికేట్ జారీ చేస్తామని చెప్పారు.

తిను బండారాలను ఎమ్మార్పీ ధరలకు మాత్రమే విక్రయించాలని సూచించారు.

హోటల్ లో పని చేస్తున్న కార్మికులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

అంతకు ముందు ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారి శ్రీ జగదీష్ తిరుమలలో హోటల్ నిర్వాహకులు పాటించాల్సిన నియమ, నిబంధనలను వివరించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ వేంకటేశ్వర్లు, హెల్త్ డిప్యూటీ ఈవో శ్రీ సోమన్నారాయణ, వీజీఓ శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ధర్మగిరిలో శాస్త్రోక్తంగా కారీరిష్టి యాగం, వరుణజపం, ప‌ర్జ‌న్య‌శాంతి హోమాలు ప్రారంభం varunajapam






రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాల‌ని, స‌కాలంలో వ‌ర్షాలు కుర‌వాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠంలో కారీరిష్టి యాగం, వరుణజపం, ప‌ర్జ‌న్య‌శాంతి హోమాలు సోమవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.

ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్‌.అవ‌ధాని ఆధ్వ‌ర్యంలో 32 మంది వేద‌, శ్రౌత‌, స్మార్థ‌పండితులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో యాగాలు, జపాలు, పారాయణాలు నిర్వహిస్తున్నారు. ఆరుగురు ఋత్వికులు కారీరిష్టి యాగం చేపడుతున్నారు.

12 మంది ఋత్వికులు గోగర్భం తీర్థంలో నడుము లోతు నీళ్లలో నిల్చుని వరుణ, పర్జన్య మంత్రాలను పఠించారు. అదేవిధంగా ఏడు వేద శాఖలకు చెందిన 14 మంది ఋత్వికులు రామాయణం, భాగవతం, మహాభారతంలోని విరాటపర్వం పారాయణం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో వేద విజ్ఞాన పీఠం అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

31.8.26

Grand Gokulastami Celebrationsat SV Gosamrakshana Shala on 4th September




TTD will conduct Gokulashtami celebrations with devotion and grandeur on September 4 at Sri Venkateswara Gosamrakshana Shala in Tirupati. A series of spiritual and cultural programmes will be organised to mark the birth of Lord Sri Krishna and promote the values of cow worship and service.


Gosamrakshana Shala to Resemble Gokulam


The Gosamrakshana Shala is being decorated with mango-leaf festoons, flowers and other traditional decorations to create a Gokulam-like ambience. The cows will also be specially decorated for the occasion.


Devotees can participate in Go Seva by offering jaggery, rice and cattle feed to the cows. TTD has appealed to devotees to make use of this sacred opportunity to serve the Go Mata.


Spiritual Programmes from Morning


The programmes will begin at 5 am with Abhishekam to Sri Venugopalaswamy, followed by flute recital at 6 am and Vedic chanting at 7.30 am.


Artists of the TTD Dasa Sahitya Project will present bhajans and kolatams, while artists of the Annamacharya Project will render Sri Hari Sankeertanas at 8 am.


At 10 am, Gopuja and Harathi will be performed in the presence of Sri Venugopalaswamy, followed by cultural programmes. Darshan of the deity and prasadam will be provided to devotees.


Harikatha on Sri Krishna's Divine Leelas


In the evening, the TTD Hindu Dharma Prachara Parishad will organise a Harikatha highlighting the divine leelas of Lord Sri Krishna and the significance of Go Seva.


TTD has appealed to devotees to participate in large numbers in the Gokulashtami celebrations and receive the blessings of Lord Sri Krishna and Go Mata through Gopuja and Go Seva.

సెప్టెంబరు 4న ఎస్వీ గోసంరక్షణశాలలో వైభవంగా గోకులాష్టమి వేడుకలు gokulastami




తిరుపతిలోని టీటీడీ శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో సెప్టెంబరు 4 గోకులాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీకృష్ణ జన్మదిన వేడుకలకు గోసంరక్షణశాల ఆధ్యాత్మిక వేదికగా నిలవనుంది. భక్తిభావాన్ని పెంపొందించేలా గోపూజతో పాటు వేదపఠనం, భజనలు, కోలాటాలు, సంకీర్తనలు, రికథ తదితర కార్యక్రమాలను టీటీడీ నిర్వహించనుంది.


గోమాత సేవ.. శ్రీకృష్ణునికి ప్రీతికరం


గోవులను ప్రేమించిన గోపాలకృష్ణుని జన్మదినమైన గోకులాష్టమికి గోసంరక్షణశాలలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. సనాతన ధర్మంలో గోమాతను పవిత్రంగా భావిస్తూ గోసేవ, గోపూజలకు విశిష్ట స్థానం కల్పించారు. ఈ సంప్రదాయాన్ని భక్తుల్లో మరింతగా పెంపొందించే ఉద్దేశంతో టీటీడీ ప్రతి ఏటా గోకులాష్టమి వేడుకలను నిర్వహిస్తోంది.


గోకులాన్ని తలపించేలా గోసంరక్షణశాల


గోకులాష్టమి సందర్భంగా గోసంరక్షణశాలను మామిడి తోరణాలు, పూలమాలలు, ప్రత్యేక అలంకరణలతో గోకులాన్ని తలపించేలా తీర్చిదిద్దుతున్నారు. గోవులను అందంగా అలంకరించి భక్తులకు కనువిందు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.


భక్తులు గోవులకు బెల్లం, బియ్యం, పశుగ్రాసం అందించి గోసేవలో భాగస్వాములు కావచ్చు. గోమాతకు గ్రాసదానం పుణ్యప్రదమని విశ్వసించే భక్తులు ఈ పవిత్ర అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.


ఉదయం నుంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు


గోకులాష్టమి రోజున ఉదయం 5 గంటలకు శ్రీ వేణుగోపాలస్వామివారికి అభిషేకం, 6 గంటలకు వేణుగానం, 7.30 గంటలకు వేదపఠనం నిర్వహిస్తారు.


 టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు కళాకారులచే భజనలు, కోలాటాలు, ఉదయం 8 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే శ్రీహరి సంకీర్తనలు ఆలపిస్తారు.


ఉదయం 10 గంటలకు శ్రీ వేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, హారతి నిర్వహిస్తారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. భక్తులకు స్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేస్తారు.


సాయంత్రం శ్రీకృష్ణ లీలలపై హరికథ


సాయంత్రం టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని దివ్య లీలలు, గోసేవ మహత్యాన్ని వివరించే హరికథ నిర్వహించనున్నారు.


శ్రీకృష్ణ నామస్మరణతో.. గోమాత సేవతో.. భక్తి పారవశ్యంతో సాగనున్న గోకులాష్టమి వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోపూజ, గోసేవలో భాగస్వాములు కావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.