Showing posts with label Spiritual. Show all posts
Showing posts with label Spiritual. Show all posts

22.6.26

మూడు టన్నుల పుష్పాలతో శ్రీ గోవిందరాజస్వామివారికి పుష్పయాగ మహోత్సవం pushpa yagam









తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో బుధవారం నిర్వహించిన పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల మధ్య జరిగింది. సుగంధభరిత పుష్పాలతో అలంకరించిన ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లగా, భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.


ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీరు, పసుపు, చందనంతో అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు సమర్పించారు.


అనంతరం మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం ఘనంగా నిర్వహించారు. గత బ్రహ్మోత్సవాలు, నిత్యకైంకర్యాల్లో తెలిసీ తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా పుష్పయాగాన్ని నిర్వహించడం ఆలయ సంప్రదాయం.


సందర్భంగా తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు తదితర 12 రకాల పుష్పాలు, తులసి, మరువం, దమనము, బిల్వం, పన్నీరాకు తదితర 6 రకాల పవిత్ర పత్రాలతో కలిపి మొత్తం మూడు టన్నుల పుష్పాలను స్వామి, అమ్మవార్లకు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన దాతలు పుష్పాలను విరాళంగా అందించారు.


సాయంత్రం స్వామివారు, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగి భక్తులకు దివ్యమంగళ దర్శనం ప్రసాదించారు.


కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీ ఎస్. శ్రీనివాసులు, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ శ్రీ శేషగిరి, ఆలయ ఇన్స్పెక్టర్ శ్రీ రంజిత్, ఆలయ అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

₹1 Cr Donation to SV Pranadana Trust




Mr. Anne Srinivasa Rao, Founder and Chairman of Sri Venkateswara Temple, Shaikpet, Hyderabad, donated Rs.1 crore to TTD's SV Pranadana Trust, which provides life-saving medical assistance to poor patients.

He handed over the DD to TTD EO Mr. Muddada Ravichandra at the EO's camp office in Tirupati on Sunday.

The EO appreciated the donor for his generous contribution and philanthropic gesture.

TTD Board Member Mr. N. Sadasiva Rao and the donor's family members were present.

ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.కోటి విరాళం donation





టీటీడీ ఆధ్వర్యంలో నిరుపేద రోగులకు ప్రాణదాతగా సేవలందిస్తున్న శ్రీ వేంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్కు హైదరాబాద్లోని షేక్పేట్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ వ్యవస్థాపకులు, చైర్మన్ శ్రీ అన్నే శ్రీనివాసరావు రూ.1 కోటి విరాళాన్ని అందజేశారు.

మేరకు విరాళానికి సంబంధించిన డిడిని ఆదివారం తిరుపతిలోని టీటీడీ ఈవో నివాస కార్యాలయంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర కు అందించారు.

సందర్భంగా ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్కు ఉదారంగా రూ.కోటి విరాళం అందించిన దాత శ్రీ అన్నే శ్రీనివాసరావును ఈవో అభినందించి, వారి సేవాభావాన్ని ప్రశంసించారు.

కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ ఎన్. సదాశివరావు, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

21.6.26

₹20 Lakhs Donation to TTD




Sri Vadlamudi Lalith Kumar and Sri Yelamanchili Krishna Rao from Hyderabad donated Rs. 10 lakh each, amounting to a total of Rs. 20 lakh, to the Sri Venkateswara Annaprasadam Trust of Tirumala Tirupati Devasthanams on Saturday.


The donors presented the donation cheques to TTD Chairman Sri B.R. Naidu.

శ్రీ గోవిందరాజస్వామివారి పుష్పయాగానికి జూన్ 21న అంకురార్పణ pushpa yagam




తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల అనంతరం నిర్వహించే పవిత్ర పుష్పయాగ మహోత్సవానికి జూన్ 21 సాయంత్రం 5.30 గంటల నుండి రాత్రి 8.30 గంటల రకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.


జూన్ 22న ఉదయం 9.30 గంటలకు స్నపన తిరుమంజనం, అనంతరం మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు పుష్పయాగ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సుగంధభరితమైన వివిధ రకాల పుష్పాలు, పవిత్ర పత్రాలతో శ్రీ గోవిందరాజస్వామివారికి విశేష అభిషేకం, అర్చనలు నిర్వహించనున్నారు.


 అనంతరం సాయంత్రం 6 గంటలకు స్వామివారి వీధి ఉత్సవం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తనుంది.

పుష్పయాగ సేవలో పాల్గొనదలచిన గృహస్తులు (ఇద్దరు) రూ.516/- టికెట్‌ను కొనుగోలు చేసి ఈ దివ్యసేవలో భాగస్వాములు కావచ్చని ఆలయ అధికారులు తెలిపారు.


కాగా, ఈ ఏడాది మే 23 నుండి 31 వరకు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు, నిత్యకైంకర్యాలలో అర్చకులు, పరిచారకులు, అధికారులు, సిబ్బంది, భక్తుల వల్ల తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ పుష్పయాగాన్ని నిర్వహించడం ఆనవాయితీ అని అర్చకులు వివరించారు.


ఈ దివ్య పుష్పయాగ మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని టీటీడీ కోరుతోంది.